పట్రాయనివారు ---------------------- రచన - యామిజాల జగదీశ్ ------------------------------------ యామిజాల కుల పయోబ్ధి సుధాంశువు/ చెళ్ళపిళ్ళ వారి శిష్యవరుడు/ భవ్య కవన శోభ పద్మనాభస్వామి/ నాదు శిష్యుడౌట నాకు గొప్ప/ ఓమారు ఓ నిండు సభలో పట్రాయని సీతారామశాస్త్రిగారు మా నాన్నగారి గురించి చెప్పిన పద్యమిది. ఇంతకూ ఈ సీతారామ శాస్త్రిగారెవరో తెలుసుకోవాలని అనిపించి మా నాన్నగారిని అడిగాను. అప్పుడు కొన్ని విషయాలు చెప్తూ వారి కుమారులైన సంగీతరావుగారి గురించి తెలిపారు. మద్రాసులో సంగీతరావుగారు మా నాన్నగారి దగ్గరకు రావడం నేను ఎరుగుదును. ఆయనతో నాకూ పరిచయమూ ఉంది. ఆదిభట్ల నారాయణదాసుగారి గురించి, సంగీతం గురించి మాట్లాడుకునేవారు మా నాన్నగారూ, సంగీతరావుగారూ. ఆయన గొంతు చాలా బాగుండేది. ఆయన కుమార్తెలు రమణమ్మ, పద్మ మా నాన్నగారి శిష్యులే. ఆయన కొడుకులు నాకు తెలుసు. ఒకబ్బాయి పేరు గోపి. మా ఇంటికి దగ్గర్లోనే ఘంటసాలవారిల్లు ఉండేది. ఆ ఆవరణలోనే పెరట్లో ఉన్న వాటాలో సంగీతరావుగారి కుటుంబం ఉండేది. సంగీతరావు గారికి చలంగారి కుటుంబంతోనే మంచి పరిచయమే ఉండేది. చలంగారి అల్లుడైన వజీర్ రహ్మాన్ గారు తమ కవితల పుస్తకంలో ఓ చోట సంగీతరావుగారి ప్రస్తావించారుకూడా. సంగీతరావుగారిని ఓమారు కలిసినప్పుడు ఆయన తమ తండ్రిగారి గురించి అనేక విషయాలు చెప్పారు. సంగీతరావుగారి తండ్రి సీతారామశాస్త్రిగారు మరెవరో కాదు, గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావుగారికి సాక్షాత్తు గురువుగారు. సీతారామశాస్త్రిగారిని చిన్నగురువుగారంటేనే సాలూరు, ఆ చుట్టుపక్కలవారికి తెలుస్తుంది. ఆయన తండ్రి నరసింహ శాస్త్రిగారు. ఈయనను పెద్దగురువుగారూ అంటారు. ఆయన ఓరోజు బొబ్బిలి రాజాగారి దర్శనం చేసుకుని సాలూరి రాజా వారి సమక్షంలో కచేరీ చేయాలని సాలూరు వచ్చారు. అలా వచ్చిన తండ్రీకొడుకులు సాలూరులోనే ఉండిపోయారు. సాలూరు రాజావారికి నాటకాల సరదా ఎక్కువగా ఉండేది. ఆ నాటకాల రిహార్సల్స్ కి ఓ వేళాపాళా లేదు. ఒకప్పుడైతే తెల్లవార్లూ రిహార్సల్ సాగేది. ఆ నాటకాలలో చిన్నగురువుగారు హార్మోనియం వాయించేవారు. అక్కడే నివాసమేర్పరచుకున్నారు. చిన్నగురువుగారిని చిన్నప్ఫుడు చిట్టిబాబు అనేవారు. వీరి ఇంటిపేరు పట్రాయని. విజయనగరం సమీపంలోని చామలాపల్లి అగ్రహారం ప్రతిగ్రహీతలే పట్రాయనివారు. వీరి తొలి ఇంటిపేరు సన్నిధివారు. సాలూరు వచ్చిన ఒకటి రెండు సంవత్సరాలకు చిన్నగురువుగారికి పెళ్ళయింది. వీరి అత్తవారింటి పేరు అయపిళ్ళ. అయపిళ్ళ లక్ష్మీనారాయణ గారి కుమార్తె మంగమ్మగారిని చిన్నగురువుగారు మనువాడారు. ఈయన 1936 లో విజయనగర మహారాజా సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా చేరారు. ఈయన సంతకం చేసేటప్పుడు సీతారామ శాస్త్రి అని కాకుండా శీతారామశాస్త్రి అని రాసేవారు. తమ గురువుగారైన చిన్నగురువుగారి గురించి ఘంటసాలగారు ఇలా అనేవారు - "గురువుగారు ఎప్పుడు తలపుకి వచ్చినా హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్ల భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధాదృష్టితో జూచు వారలెందరో మహానుభావులు" అనే శ్రీ త్యాగరాజస్వామి వారి వాక్యానికి లక్ష్యప్రాయంగా కనబడుతారు అని. గురువుగారిని దర్శించిన ఆ క్షణమే వారి మూర్తిమంతం, ప్రియభాషణ తనను పరవశుణ్ణి చేసాయన్నారు ఘంటసాలవారు. వారి గురుత్వం ఆజన్మ సిద్ధమైనదనిపించిందని ఘంటసాల వారి అభిప్రాయం.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం