రావణ తనయుల మరణం.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. కుంభకర్ణుని మరణవార్తవిన్న రావణుడు మూర్చపోయాడు.అనంతరం అరివీరభయంకరుడు,బ్రహ్మదేవునివరప్రసాది కుంభకర్ణుడు ఒక సామాన్యమానవునిచేతిలో మరణించడం నమ్మలేకపోతూ చింతించ సాగాడు.అదిచూసిన రావణుడి తనయులు నరాంతకుడు, దేవాంతకుడు, త్రిశిరుడు,అతికాయుడు తమతండ్రి ఆశీర్వాదంపొంది సర్వసైన్య సమేతంగా చిత్ర విచిత్రవాహనాలతో యుద్ధరంగానికివచ్చి వానరసైన్యాన్ని హతమార్చసాగారు.అంగదునితో యుద్ధానికి దిగిన నరాంతకుడిని తనముష్టిఘూతాలతో యమపురికిపంపాడు అంగదుడు.అదిచూసిన మత్తుడుఅనేరాక్షసయోధుడుతనగజాన్నిఅంగదునిపైకినడిపాడు.ఆగజాన్నితనపిడికిలిపోటుతో నేలకూల్చాడు అంగదుడు.దేవాంతకుని చేతిలో అంగదుడుమూర్చపోవడంచూసినహనుమంతుడుదేవాంతకుడు,నీలుడు,త్రిశురుడులను ఎదుర్కొన్నారు.హనుమంతుని బాహుబలానికి తలపగిలి దేవాంతకుడు మరణించాడు.త్రిశిరుడు నిలుడు పోరాడుతూఉండగా మధ్యలోమత్తుడురావడంతోనిలుడుఇరువురితోపోరాడసాగాడు.కోలుకున్న అంగదుడు మత్తునియమపురికిపంపాడు.అక్కడ హనుమంతుని ధాటికి నెత్తురు కక్కుతూ త్రిశురుడు నెత్తురుకక్కుతూ ప్రాణాలు విడిచాడు. ప్రాణాలువిడిచారు.అదిచూసిన మహాపార్మ్వడు పెడబోబ్బలుపెడుతూ అంగదునిపైకి వచ్చాడు.అంగదుడు అప్పటికే అలసి ఉండి తూలడం గమనించిన బుషబుడుఅనే వానరయోధుడు మహాపార్మ్వనితో తలపడిభీకరసమరంచేసిఅతన్నిచంపాడు.వానరసేనలు విజయధ్వానాలు చేస్తూ రాక్షససేనలను తరుమసాగియి.అదిచూసిన అతికాయుడు సింహనాధం చేస్తూ భయంకరంగా యుధ్ధరంగంలో వానరసేనలను వధించసాగాడు.లక్ష్మణుణు శ్రీరాముని ఆశిస్సులుపొంది అతికాయునితో తలపడి పలుదివ్యఅస్త్రాలు ప్రయోగించాడు వాటి అన్నింటిని తనశరాలచే నిలువరించిన అతికాయుడు"నీవు చిన్నవాడవు నాతోసమఉజ్జికాదు పో,మీఅన్నశ్రీరాముని రమ్మను"అన్నాడు. కోపించిన లక్ష్మణుడు ఓఅస్త్రంతో అతికాయుని నుదుడిపై గాయాన్ని చేసాడు. తనధనస్సు సంధించిన అతికాయుడు లక్ష్మణుని వక్షస్ధలంపై గాయంచేసాడు.కోపించిన లక్ష్మణుడు బ్రహ్మస్త్రాన్ని మంత్రించి అతికాయునిపై ప్రయోగించగా అది అతనితనఖండించింది.(ఈఅతికాయుడు రావణునికి ధాన్యమాలి లకుజన్మించాడు) వానరసేనలజయధ్వానాలతో యుధ్ధరంగం దద్దరిల్లింది.రాక్షససేనలు పలాయనం చేసాయి.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
• T. VEDANTA SURY
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి