నిజమే కదూ...---ఈ మధ్య నాకెంతో ఇష్టమైన తమిళ రచయిత్రి ప్రసంగం ఒకటి విన్నాను. ఆవిడో మాట చెప్పారు. అదెంతో ఆలోచనలో పడేసింది. బాగా ఆలోచిస్తే నిజమే అన్పించిందికూడా. ఇంతకూ అదేంటంటే, మనకిష్టమైన వారిని ఫోటోలు అడిగి వాట్సప్ లో పంపమని అడుగుతుంటాం. అయితే అందరిలో కొందరే ఫోటోలు ఇస్తారు. కొందరివ్వరసలు. వారికి మన మీద నమ్మకం లేకపోవచ్చు లేక ఫోటోలో ఏముంది నీకు నన్ను తెలుసు - నాకు నిన్ను తెలుసు అంటారు. అటువంటప్పుడు ఫోటోలతో పనేమిటీ అనిపిస్తుంది. అయినా ఇష్టమైన వారు కొందరు అడక్కుండా వాళ్ళంతట వాళ్ళే ఫోటోలు షేర్ చేస్తారు వాట్సప్లో. అవి అందడంతోనే.పట్టరాని ఆనందంతో థాంక్స్ చెప్తాం. ఇక ఫేస్ బుక్కులో అయితే వేరే చెప్పక్కర్లేదు. ఫోటో ఎలాటిదైనా కావచ్చు. బాగుందా బాగులేదా అనే.దాంతో పని లేకుండా లైకులు కొట్టడం ఐ లవ్ యు చెప్పడం లవ్ సింబల్స్ తో థాంక్స్ చెప్పడం వీలుంటే కామెంట్లు చేయడం. అదలా ఉండనిస్తే వాట్సప్ లో ఫోటో పంపగానే సేవ్ చసుకోవడం ఒకటి రెండు సార్లు చూసుకోవడం మామూలే. అయితే సెల్ ఫోన్ మొత్తం ఫోటోలతో నిండోపోయి ఓవర్ లోడ్ అయితే ఏమాత్రం ముందు వెనకలు ఆలోచించక చూడకుండా మొత్తాన్ని ఒక్క దెబ్బతో డెలీట్ చేసి పారేస్తాం. ఫోటో తెప్పించుకునే దాక నువ్వు లేకపోతే నేను లేనని ఎమోషన్స్ తో ఏవేవో మాటలనేస్తాం. తీరా ఫోన్లో లోడ్ ఎక్కువైనప్పుడు ఆ ప్రేమా అభిమానమూ అడగడొలు వంటివన్నీ ఎటు పోతాయో పోతాయి. కనుక నేను ఫోటోలు షేర్ చేయడానికో పంపడానికో పెద్దగా ఆసక్తి చూపనని ఆ తమిళ రచయిత్రి చెప్పడం నూటికి నూరు శాతం నిజమే అనిపిస్తోంంది. అభిమానమో ప్రేమో ఎదలో ఉంటే చాలదా? మళ్ళీ ప్రశ్నించడం ఎందుకు....సరిపోతుంది ఎదలో ఇష్టమైన వాళ్ళుంటే....- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం