"దానికేం, అవుదువుగానీ!"--స్వామి వివేకానంద జీవితంలో చిన్ననాటి ముచ్చట....నరేంద్రుడి (స్వామి వివేకానంద) స్కూల్లో చదువుకుంటున్న రోజులవి. ఓరోజు టీచర్ విద్యార్థులందరినీ అడుగుతుంది పెద్దయితే ఏమవాలనుకుంటున్నారు" అని. ఒక్కొక్కరూ ఒక్కొక్కటి చెప్తారు. నరేంద్రుడి వంతురాగానే "నాకు జట్కావాలా అవాలనుంది" అంటాడు.ఆ మాటకు సహవిద్యార్థులందరూ పెద్దగా నవ్వుతారు.దాంతో నరేంద్రుడు చిన్నబోతాడు. మొహం వేలాడేసుకుని ఇంటికి చేరుకుంటాడు. అతని ముఖాన ఉన్న విచారాన్ని తల్లి గ్రహించి దగ్గరకు తీసుకుని "ఏమైందిరా? స్కూల్లో ఏమైందిరా నాన్నా? ఎవరన్నా ఏదన్నా అన్నారా?" అని అడుగుతుంది. అప్పుడు నరేంద్రుడు స్కూల్లో జరిగిన విషయం చెప్తూ "జట్కావాలా అవడం తప్పామ్మా?" అని అమాయకంగా అడుగుతాడు. అందుకు తల్లి "ఇందుకా ఇలా బాధపడుతున్నావు. దానికేం, నువ్వనుకున్నట్టే అవుదువు. అదేం తక్కువో తప్పో కాదురా" అంటూ గదిలో మేకు తగిలించి ఉన్న గీతోపదేశం ఫోటో చూపించి మాట కొనసాగిస్తుంది "ఇదిగో, నువ్వు ఆ ఫోటోలో రథసారథిగా ఉన్న కృష్ణుడిలా అవాలి" అని చెప్తుంది. గీతార్థం చెప్తుంది.తల్లి మాట ఫలించిందిగా! స్వామి వివేకానందగా దేశ విదేశాలలో చేసిన ప్రసంగాలన్నీ యావత్ మానవాళికీ ఆణిముత్యాల్లాంటి ఉపదేశాలయ్యాయి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మాటలు అనుసరణీయమేగా.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం