మానేరు ముచ్చట్లు-కాకతి రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యం చేయగా అతని తమ్ముడైన మహా దేవుని కుమారుడు గణపతి దేవ చక్రవర్తి దాదాపు ఆరు దశాబ్దాల పాటు పరిపాలించి దక్షిణ భారతదేశచక్రవర్తులలో అగ్రగణ్యుడిగా నిలచిన వాడు.చరిత్రకారులు శోధించి రచించిన చరిత్రననుసరించి ఇతడుయాదవరాజైన జైతుగి బందీగా కొంతకాలమున్నాడని,అంతవరకు కాకతీయులకు విశ్వాసపాత్రులుగా ఉన్న కొందరు మంత్రులు, యాదవ రాజు వద్దకు వెళ్లి తమ శక్తియుక్తులతో యాదవరాజును మెప్పించి,గణపతిదేవుని విడిపించుకుని వచ్చి సింహా సనం పై కూర్చోబెట్టడం జరిగింది.స్వ తహాగా ప్రతిభాశాలియైన గణపతి దేవుడు అచిరకాలంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసాడు. ఈయన అటు రాజ్యనిర్మాణంతో పాటు రుద్రదేవుడి కాలంలో మొదలైన దుర్గనిర్మాణం కూడా చేపట్టి ఓరుగల్లులో శత్రుదుర్భేద్యమైనకోటను నిర్మించి రాజధానిని అను మకొండ నుండి ఓరుగల్లుకు మార్చా డు.ఇక సబ్బిసాయిరానికి వస్తే ఈయన కాలానికి చెందిన ఎనిమిదిశాసనాలు మంథని, కటుకూరు, గొడి శాల,ధర్మపురి,కాళేశ్వరము, మేడారం,ఖంభంపెల్లి,ఎలగందులలో ఉన్నా యి.ఈ కాలానికే చెందిన రెండు తామ్రశాసనములు కూడా దొరికి నట్లు వాటి వల్ల అప్పటి ఈ ప్రాంతపాలకు డు అక్షయ చంద్రదేవుడని తెలియు చున్నది.ఓరుగల్లు కోట నిర్మాణ శైలిని గమనిస్తే ఎలగందుల కోట నిర్మాణ ములో దాని ప్రతిరూపములు అనేకం కనిపిస్తాయి.దీనిని బట్టి చూస్తే గంగాధరుని కాలములో ఇక్కడి దేవాలయ నిర్మాణము జరిగి ప్రాయికంగా ఈ ప్రాంత రాజధానికి అనువైన ప్రదేశ మని నిర్ణయింపబడి ఉంటుంది.ఎప్పుడైతే గణపతి దేవుడు చక్రవర్తి సింహాసనమధిష్టించాడో అప్పుడే రాజ్య సర్వతో ముఖాభివృద్ధికి గణనీయమైన కృషి జరిగి ఉంటుంది.ముఖ్యంగా గోదావరి,మానేరు పరీవా హక ప్రదేశము మంచి పంటలకు ఆలవాలమైంది కనుక ఈ ప్రాంత అభివృద్ధికై తగిన ఏర్పాట్లు కావించ డంలో ఆశ్చర్యపడవలసిన పనిలేదు.మరొక్క విషయము కూడా ఇక్కడ ప్రసితావించవలసిన అవసరం ఉన్నది.ఇది ఈ ప్రాంతములో నివ సించి ప్రత్యేక శ్రద్ధతో గమనించిన వారికే బోధపడుతుందన్నది నాకుఅనుభవం నేర్పిన పాఠం.స్థానికత పరిశోధకులకు ఒక అదనపు అర్హతఅని నేను భావిస్తాను.డా.సంగనభట్ల నర్సయ్య గారు స్థానికులు గావున, గోదావరి(తెలివాహ),కోటిలింగాల,బాదనకుర్తి,విశేషంగా ధర్మపురి గురించి ఎన్నో విషయాలు వెలుగులోకితెచ్చారు.అలాగే డా.జైశెట్టి రమణయ్యగారు ఈ జిల్లాకు చెందిన వారు గనుక అనేక చోట్లకు తిరిగి, విషయ సేకరణ చేసి ఎన్నో విషయాల ను వెలుగులోకి తెచ్చారు.అలాగే ఇంకా ఎందరో పరిశోధకులు కూడా ఉండిఉండవచ్చు.అనేక సాహిత్య చారిత్రకపరిశోధనలను చూస్తే నేను గమనిం చిన విషయం పరిశోధకుల స్థానికతవారి పరిశోధనలోని స్థానిక సమాచార విశేషాధిక్యతను చెప్పకనే చెప్పుతు న్నది.దీనిని నేను సమర్థిస్తాను కూడా.అంతే గాక అది చాలా అవసరమైన విషయం కూడా.ఎవరి కైనా వారి ఊరి గురించి కాని,ప్రాంతం గురించి కాని అవగాహన ఎక్కువగాఉండే అవకాశం ఉంది.కరీంనగరం నుండి హైదరాబాదు వెళ్లే మార్గంలో ,కరీంనగర్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో మానేరుకు అటువైపు దక్షిణదిశలో శనిగరం గ్రామం ఉంది.ఇక్కడి శాసనాలను పరిశీలిస్తే బేతరాజు కాలం నుంచే అనుమకొండ విషయం ఇక్కడి వరకు ఉన్నట్లు తెలుస్తుంది. తరువాతి కాలంలో వేములవాడ చాళుక్యుల అనంతరం మరికొంత దక్షిణ సబ్బిసాయిరప్రాంతం వీరి అధీనంలోనికి వచ్చిందని ఇంతకు ముందు అనుకున్నాం.అది ఏదై ఉంటుందనే విషయంపై ఎవరూ పట్టించుకున్నట్లు లేదు.మానేరుకు దక్షిణ తీరం లో శనిగరం గ్రామానికి పడమటి దిశలో ఉన్న గ్రామాలను పరిశీలిస్తే ఈ విషయం విశదమవు తుంది.బెజ్జంకి,రేపాక,ఇల్లంతకుంట, గాలిపెల్లి,గన్నేరువరం, మైలారం,హస్నాపురం,సంగెం,యాస్వాడ,వర్కోలు,కటుకూరు మొదలైన గ్రామాలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.ఇందులో కొన్ని గ్రామాలు అప్పటినుంచే ఉన్నాయి.అక్కడ లభించే విగ్రహాలు గాని ఆ గ్రామనామాలు గానీ కొన్ని నాటి కాకతీయుల కాలం ను చెలియ జెప్పేవిగా ఉన్నాయి.అందులో కొన్ని గ్రామాలు మానేరు జలాశయం ముంపుకు గురై ఆనవాళ్లు లేకుండా పోయాయి.వీటిని గురించి పరిశోధన చేయవలసిన అవసరం ఉంది.నాకు తెలిసిన ఒక ఉదాహరణం మాత్రమే చెబుతాను రేపటి ముచ్చట్లలో.- రామ్మోహన్ రావు తుమ్మూరి
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
• T. VEDANTA SURY
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి