నేనంటే ...---జీవితంలో అనేక ఆశలతో కలలతో ఏదో ఒకరోజు విలాసవంతమైన జీవితం జీవించాలని కష్టపడి చదువుతున్నాడు. మంచి మార్కులతో ప్యాసై మంచి ఉద్యోగం పొందాలని ఆశ. అయితే అలాగే కష్టపడి చదివాడు. మంచి ఉద్యోగమూ వచ్చింది. కానీ అనుకోని సమస్యలతో ఒత్తిడికి లోనవుతున్నాడు. అతను అనుకున్న చాలా ఆశలు నెరవేరలేదు ఏవో ఒకటి రెండుతప్ప. మనసులో రోదనే. ఏంటిలా అయిపోయింది బతుకూ అని నీరసించిపోయాడు.అతనికెవరో చెప్పగా తిరువణ్ణామలైలో ఉన్న రమణాశ్రమాన్ని చూసిరావాలనిపించింది. సరే అనుకుని ఓమారు వెళ్ళాడు.అక్కడ భగవాన్ రమణ మహర్షి సమాధి చూశాడు. రమణ మహర్షి ధ్యానం చేసిన గదిని చూశాడు.అక్కడ అనుకున్నాడు..."భగవాన్ నాలో ఏవేవో ఆశలు. నాకవేవీ నెరవేరడంలేదు. దాంతో నాకు జీవితంమీద విరక్తి పుడుతోంది. నా మిత్రులందరూ మంచి మంచి హోదాల్లో ఉన్నారు. ఉన్నవాటితో తృప్తిపడలేకపోతున్నాను. నేనేం చెయ్యాలి. నేను మాత్రం ఎందుకిలా ఉన్నాను స్వామీ అని అన్నాడు. అప్పుడతనికి ఓ మృదువైన గొంతు వినిపించింది.అవును అన్నిసార్లు నేనూ నేనూ అని అంటున్నావు. ఇంతకూ ఈ నేను ఎవరు? నీ దేహాన్ని చెప్తున్నావా? లేక నీ మనసుని చెప్తున్నావా? నాకొక్కసారి ఆ "నేను"ని చూపవా? ఆ నేనులోనే కొంతసేపు ఉండి చూడు. నాకు నాకూ అంటున్నావు కదా. నాకు బాధగా ఉందంటున్నావు. ఇంతకూ ఆ నేను అనేది ఎరుపా? నలుపా? లేక అదేమన్నా వస్తువా? లేక నీ మెదడా? నీ మనసా? లేక నీ కళ్ళా? లేక నీ చెవులా? నేను అనే దాని స్వభావమేంటీ? అని భగవాన్ ప్రశ్నిస్తున్నట్లు వినిపించింది. యువకుడు తనకేమీ అర్థంకాలేదన్నాడు.మళ్ళీ భగవాన్ మాటలు వినిపించాయి..."నాకు అర్థంకాలేదంటున్నావు. మళ్ళీ నాకూ నేనూ అంటున్నావు. ఏమిటవి? నేనూ అనే భావన నిన్ను వదిలిపెట్టలేనంత గట్టిగా పట్టుకుందా? ఉదాహరణకు...నీకు ఉక్కగా ఉందనుకో. చెమటపడుతుంది. ఒంట్లో వేడిగా ఉందంటావు. అలాగే చలి ఎక్కువైనప్పుడు చల్లగా ఉందంటావు. అంటే ఇంతకూ ఈ అనుభూతులు అనుభవిస్తున్నవన్నీ నేనూ నాకూ అనుకున్నవేనా? లేక నీ దేహానిదా? ఏది అనుభవిస్తోంది? ఏదలా చెప్పిస్తోంది? నువ్వు అనేదేంటో తెలుసుకో. అది తెలుసుకోగలిగితే నీలోని మానసిక సంఘర్షణకు తావుండదు. నిలకడగా ఉంటుంది. నువ్వేం చేసినా ఈ అరుణాచలంమీద భారంమోపి చెయ్యి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నాదీ నీదీ నేనూ నువ్వూ అనేవి లేకుండాపోతాయో అప్పుడు ఈ గొడవలుండవు...." అని భగవాన్ చెప్తున్నట్టే అనిపించిందా యువకుడికి అంతే, అప్పటి నుంచి అతనిలో క్రమేపీ మార్పు వచ్చింది.ఇటువంటివి చదువుతున్నప్పుడో విన్నప్పుడో చలంగారి మాటలు గుర్తుకొస్తాయి.... "నీకు నేనత్యంత అవసరమని, నా రాకకై చీకటిని చీల్చి నువ్వు నిరీక్షిస్తున్నావని, చివరికి ఎట్లాగో నన్ను నీ సమక్షాననిలుపుకుంటావని ఎందుకో నమ్మకం. చాలా స్పష్టమైన అసందర్భపు విశ్వాసం కాకపోతే ఈ ఇసికలో పడుకుని నిద్రపోవాలనిపిస్తోంది. నీలో తప్ప నాకు లోకంలో చోటు లేదు. నీ ఆలింగనంలో తప్ప నాకు శాంతి లేదు. భగవాన్ నువ్వే గతి. నాకింక శక్తి చాలదు...." - యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం