నేలతో నా అనుబంధం. నాట్లు,కలుపులు,ఎరువులు (యూరియా)ఇవి మనం చేసే పని.పైరు పెరగటం అన్నది ప్రకృతి పని నారు మడి నుంచి ,నాటిన పైరు నిలబడి లేత పచ్చనుంచి క్రమంగా రంగు మారి ముదురు ఆకుపచ్చగా మారటం.రోజూ పొలం వెళ్లి చూసినా సరే రోజుకో రకంగా కనపడేది అదేమిటో.పొట్టమీదకి వచ్చిన పైరు పాల కంకి వెళ్ళినప్పటి నుంచి రైతు కళ్ళలో మెరుపు వస్తుంది. మా బుల్లెయ్య నువ్వెందుకు రాణెమ్మా ! బురదలో పెద్ద గనెం మీద కూర్చో అన్నా సరే లోపలి గట్ల మీద పొలం అంతా తిరిగేదాన్ని.మా కొత్త రైతు(మొగలి పూల) యమాహుషారుగా తన నాలుగు ఎకరాల పని అందరి కంటే ముందు ముందు చేసుకుని.మిగిలిన వాళ్ళకి సాయం వచ్చేవాడు.అందరికీ తలలో నాలికలా అయ్యాడు.నరసరావుపేట మా ఇంటికి వచ్చి ఆ ఏటికి వడ్ల పురి (గడ్డిఎంట్ల తో చేసే గాదె) తనే కట్టి పెట్టాడు. ఆ ఏడు కాలం కూడా బాగా అయి పంట కూడా బాగా పండింది.వెంకటరత్నం అని ఇంకో రైతు మొదట తన కుప్ప నూర్చాడు.అతను చేసే పొలం ఎకరం కనుక కుప్పనూర్చటం,తూరిపార పట్టటం, వడ్లు గోతాలకి ఎత్తడం ,కాటా వేయటం ,మా వంతు ఇంత అని నిర్ణయించడం అన్నీ సాయంత్రానికి అయిపోయాయి. మరునాడు మా మొగలితోపు రైతు వంతు రెండు కుప్పలుగా వెయ్యమంటే వినకుండా మొత్తం నాలుగెకరాలకి ఒకటే వరికుప్ప వేసాడు.సాయంత్రం వరకు కొట్టడమే సరిపోయింది.గాలి ఆగిపోయి తూర్పారపట్టటం అవ్వలేదు.బుల్లెయ్య మొత్తం వడ్ల కుప్ప మీద పెద్ద పట్టా కప్పించి.నన్ను,అమ్మమ్మని ఇంటికి వెళ్లమన్నాడు.తనుకూడా ఇంటికి వెళ్లి పెండలాడే అన్నం తిని వచ్చి చేలో పడుకుంటాను అని చెప్పి.సైకిల్ వేసుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. మా మొగలితోపు రైతు రోడ్డు వరకూ వచ్చి నన్ను,అమ్మమ్మని బస్ ఎక్కించాడు.బస్ మా పొలం దాటి రూపెనగుంట్ల ఊళ్ళో కి వెళుతుంది.ఊళ్ళో స్టాప్ రాగానే నేను గబుక్కున బస్ దిగేశాను.వెనక్కి గబ గబా పొలం కేసి నడిచాను పరిగెత్తినట్లుగా.అమ్మమ్మా నేను ఎందుకు దిగానో అర్థం కాక తానూ కాస్త ముందుకు వెళ్లిన బస్ ఆపించుకుని దిగి నా వెనుక వస్తోంది. నేను ఇవేమీ గమనించే స్థితిలో లేను మా మొగలితోపు రైతు మమ్మల్ని బస్ ఎక్కించే టప్పుడు నవ్విన నవ్వే నాకు గుర్తుకు వస్తోంది.రోడ్డుదిగి పొలంలో కుప్ప దగ్గరికి వెళ్లి చూస్తే .అర్ధ చంద్రాకారంగా కుప్పనూర్చి వేసిన గడ్డి ,మధ్యలో వడ్లమీద మా బుల్లెయ్య కప్పించిన పట్ట తొలగించి బంగారు రంగులో వడ్ల కుప్ప.మా మొగలిరైతు,మరో ఇద్దరు మనుషులుగబగబా గోతాల్లోకి వడ్లు ఎక్కిస్తూ. ఒక్క క్షణం ఆవేశం,కోపం,కసి కలిగాయి , కానీ చాలా నిబ్బరంగా నిలబడి మొత్తం ఎన్ని గోతాలు ? అని మాత్రం అడిగా.అంతే అతను రాణెమ్మా అని తడబడ్డాడు.ఈలోగా అమ్మమ్మా,బుల్లెయ్య కూడా వచ్చారు.నా గంభీరమైన మొఖం చూసి అమ్మమ్మ కూడా ఏమీ మాట్లాడలేదు.చూసుకో బుల్లెయ్యా అని అమ్మమ్మ చేయి పట్టుకుని నేను రోడ్డు ఎక్కాను. నా నేల నాకు నేర్పిన మొదటి పాఠం క్షమ,ఉపేక్షించటం. -వసుధ రాణి


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం