నువ్వే సర్వం మాకు--పాండవులు, కౌరవుల మధ్య జరగబోయే కురుక్షేత్ర యుద్ధంకోసం సన్నాహాలు జరుగుతున్నాయి కురుక్షేత్రంలో ఏనుగులతో భారీ వృక్షాలను వేళ్ళతోసహా నేలకూల్చి చదును చేస్తున్న వేళ.ఓ చెట్టుపై ఓ తల్లి పిచ్చుక తన నాలుగు పిల్లలతో నివసిస్తోంది. ఆ చెట్టును కూలుస్తున్న సమయంలో ఎగరడం చేతకాని తన పిల్లలతో సహా తల్లిపక్షీ నేలమీద పడిపోయింది.తల్లి పక్షి అటూ ఇటూ చూసింది. కాస్తంత దూరంలో కృష్ణార్జునులు కనిపించారు.తల్లి పక్షి ఎగురుకుంటూ పోయి కృష్ణుడి రథంమీద వాలింది. "కృష్ణా! రేపు యుద్ధం ప్రారంభమవుతే నా పిల్లలతోపాటు నేనూ చనిపోతాను. కనుక నువ్వే మమ్మల్ని కాపాడాలి" అని తల్లిపక్షి కోరింది. "నీ మొర నాకు వినిపిస్తోంది. కానీ ప్రకృతి విధులకు భిన్నంగా నేనేమీ చెయ్యలేను. యుద్ధాన్ని ఆపలేను" అంంటాడు కృష్ణుడు. "నాకు తెలిసిందల్లా నువ్వు మాత్రమే. మమ్మల్ని కాపాడు. మమ్మల్ని రక్షించడమో లేక నాశం చేయడం నీ చేతుల్లో పెడుతున్నాను. ఆపై నీ ఇష్టం" అన్నాది తల్లిపక్షి. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. కృష్ణుడు చెప్పిన సమాధానం ఇదొక్కటే.తల్లిపక్షికీ, కృష్ణుడికీ మధ్య జరిగిన సంభాషణ అర్జునుడికి అర్థం కాలేదు.యుద్ధానికి ముందర కృష్ణుడు అర్జునుడితో తన విల్లంబులను ఒక్కమారు ఇమ్మన్నాడు. అర్జునుడికి ఆశ్చర్యమేసింది.యుద్ధంలో ఆయుధాలు ముట్టనని చెప్పి తనకు రథసారథిగా మారిన కృష్ణుడు దేనికోసం విల్లంబులు అడిగాడో అర్థం కాలేదు అర్జునుడికి.అయినా అడిగాడు కదాని అర్జునుడు వాటిని కృష్ణుడికి ఇచ్చాడు.కృష్ణుడు ఓ ఏనుగు మెడలో ఉన్న ఓ గంటపై బాణాన్ని సంధించి దానిని తెంపి దూరంగా విసిరాడు. విషయం అర్థంకాని అర్జునుడు ఏనుగుని నేలకూల్చలేకపోయాడే అని మనసులో అనుకుని కృష్ణుణ్ణి చూసి ఒకింత హేళనగా నవ్వాడు.కృష్ణుడికన్నా తానే విలువిద్యలో అన్ని విధాల సమర్థుడినని మనసులో గర్వపడ్డాడు అర్జునుడు.అర్జునుడు మనిషేగా."నేను కావాలంటే బాణం సంధించి ఏనుగుని నేలకూల్చనా" అని అడిగాడు అర్జునుడు.కృష్ణుడు ఓ చిన్న నవ్వు నవ్వి విల్లంబులను అర్జునుడికిచ్చి రథంలో పదిలంగా ఉంచు అన్నాడు."మరెందుకు ఏనుగుమీద బాణం ఎక్కుపెట్టావు?" అని అడిగాడు అర్జునుడు."అమాయకులైన పక్షుల గూటిని చెదరగొట్టిన ఏనుగుకి ఇదొక శిక్ష" అని మాత్రం చెప్పాడు కృష్ణుడు. అర్జునుడికి ఒక్కముక్కా అర్థంకాలేదు. యుద్ధం జరిగింది. పద్దెనిమిదో రోజు పాండవులు గెలిచారు.అర్జునుడితో పరంధాముడు యుద్ధరంగమంతటా చుట్టి వచ్చాడు! తాను పూర్వం విసిరేసిన గంట దగ్గరకొచ్చి నిల్చున్నాడు కృష్ణుడు."అర్జునా! ఈ గంటను తీయి" అన్నాడు కృష్ణుడు."ఎన్నో ముఖ్యమైన పనులుండగా తెగి కింద పడిపోయి ఉన్న ఈ గంటే కృష్ణుడికి ప్రధానంగా కనిపిస్తోందా?" అని అనుకుని అర్జునుడు చెప్పినట్లే ఆ గంటను తీశాడు. అప్పుడు ఆ గంట కింద ఉన్న తల్లి పక్షితోపాటు మిగిలిన నాలుగు పిట్టలూ రెక్కలు విదిల్చి సంతోషంగా ఎగిరాయి.తల్లిపక్షి కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణం చేసి తమను ఓ గంట పదిలంగా కింద ఉంచి పద్దెనిమిది రోజుల యుద్ధంలో తమ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంది."భగవాన్! నన్ను మన్నించు. నిన్ను మానవరూపంలో మాత్రమే చూసిన నాకు నువ్వు నిజంగా ఎవరన్నది నా చిట్టిబుర్ర తెలుసుకోలేక పోయింది" అన్నాడు అర్జునుడు.పుట్టిన ప్రతి ప్రాణిని ఎప్పుడు ఎలా రక్షించాలో పరమాత్మకు బాగా తెలుసు.కనుక భగవంతుడే శరణు శరణు. మిగిలినదంతా అతనికే విడిచిపెట్టాలి. అప్పుడతనే చూసుకుంటాడు బాగోగులన్నీ.(తమిళంలో ఓ ప్రవచనకర్త చెప్పగా విని రాశానిది)- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం