ఆంగ్లేయుల దేశభక్తి -- నారంశెట్టి ఉమామహేశ్వరరావు -- రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ సైన్యాలు బెల్జియం, హాలండ్ , ఫ్రాన్స్ దేశాలను పాదాక్రాంతం చేసుకుని డన్ కిర్క్ రేవు దగ్గర బ్రిటీష్ సైన్యాలను ఓడించి, రాత్రింబవళ్ళు బాంబుల వర్షం కురిపించి బ్రిటన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి. వారికి అదొక మహావిపత్తు. అప్పటి ప్రధాని విన్ స్టన్ చర్చిల్ తన మాటలతో, చేతలతో ప్రజలను చైతన్యవంతులను చేసారు. ఆ దేశ ప్రజలు అమోఘమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు.మరో వైపు పులి మీద పుట్రలా వారిని ఆహార కొరత పీడించింది. బయట నుండి వచ్చే ఆహార పదార్ధాలను దేశంలోకి చేరకుండా జలాంతర్గాముల ద్వారా అడ్డుకుంది జర్మని. అతితక్కువ ఆహారంతో సరిపెట్టుకుని మాతృదేశ రక్షణకై యుద్ధంలో పాల్గొన్నారు బ్రిటన్ ప్రజలు. అలా ఆరు సంవత్సరాలు జరిగిన యుద్ధంలో బ్రిటన్ ప్రజలు చూపించిన సహనం, తెగువ అమోఘం. వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రశంసనీయం. చివరికి మిత్ర దేశాల సహకారంతో ఘన విజయం సాధించింది బ్రిటన్. ప్రధాని విన్ స్టన్ చర్చిల్ పై ప్రశంసల వర్షం కురిసింది. ఆ అభినందనలను సున్నితంగా తిరస్కరించిన చర్చిల్ “నా జాతికి సింహానికున్నంత గుండె ఉంది. కేవలం గర్జించానంతే” అన్నారు. ఈ కథ మన దేశానికి ప్రస్తుత సందర్భానికి అన్వయించుకుందాం.మహమ్మారి కరోనా నిర్దాక్షిణ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్న సందర్భంలో ఇంగ్లండు ప్రజల్లా దేశభక్తి ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది.బ్రిటన్ ప్రజలు సరిపడినంత ఆహారం లేకపోయినా దేశ రక్షణ కోసం ఓర్చుకున్నారు. అదీ ఆరు సంవత్సరాల కాలం.ఇప్పటి మన యుద్ధం ఇంగ్లండులా కాకుండా విచిత్రమైనది. మన శత్రువు కంటికి కనబడదు. అందుకే ఆత్మరక్షణ చేసుకోవాలి. అదీ కొన్ని నెలలే.కరోనా కట్టడికై దేశానికి లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని మోదీపై విశ్వాసంతో జాతి యావత్తూ ఏకత్రాటిపై నిలిచి స్వీయ నిర్బంధం, సామాజిక దూరం, పరిశుభ్రతలను పాటిస్తూ ఇంట్లోనే గడుపుతూ వ్యాధి వ్యాప్తిని అరికట్టి విజయం సొంతం చేసుకోవాలి.మన ప్రధాని చేత కూడా “భారత జాతికి సింహానికున్నంత గుండె ఉంది. కేవలం గర్జించానంతే” అని గర్వపడేలా చేయాలి. అది మనందరి బాధ్యత.ఇలాంటప్పుడే దేశభక్తి, ఐకమత్యం ప్రదర్శించాలి.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
• T. VEDANTA SURY
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి