తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.

నన్నయ యుగం:-తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే పదకొండవ శతాబ్దంలో నన్నయ వ్రాసిన ఆదికావ్యం మహాభారతం తెలుగున అనువదించినట్లు స్పష్ట 
మవుతుంది. అందుకే ఈ యుగాన్ని నన్నయ యుగం అంటారు. నన్నయ్య ఎక్కువ కావ్యాలు రాసి అందరినీ ప్రభావితం చేశాడు.   తన అను యాయులతో పాటు తను వేసిన మార్గంలోనే, తన
 సాహిత్యాన్ని నడిపించాడు.  యుగకర్త నన్నయను,
ఆదికవి యని బిరుదు నివ్వడం జరిగింది.               తిక్కన యుగం :-13వ శతాబ్దికి తిక్కన యుగమని అంటారు.తిక్కన ఇంటి పేరు "కొట్టరువు"వారు. ఇతని తండ్రి పేరు కొమ్ననాథుడు. తాత గారి పేరు భాస్కరుడు. తిక్కన నెల్లూరు నివాసి.
నన్నయ్య, తన రచనలో సంస్కృత పదాలు ఎక్కువగా వినియోగిస్తే, తిక్కన తెలుగు పదాలు ఎక్కువగా వినియోగించి,తెలుగు భాష వైశిష్ట్యాన్ని చాటి చెప్పాడు.కవిత్వం తన జాతి కోసం రాస్తున్నానని తిక్కన చెప్పుకొచ్చాడు. "ఇతను కావించిన కవిత్వ సృష్టి ఇతరులకు చేత కాదు."అని తిక్కనను, ఎర్రన్న ప్రశంసించాడు.
నన్నయ పదకొండవ శతాబ్దం వాడు అయితే తిక్కన పదమూడవ శతాబ్దము వాడు.
వీరిద్దరి మధ్య కాలం అనగా పన్నెండవ శతాబ్దము, తెలుగు సాహిత్యంలో కొందరు శూన్యం అని పొరబడతారు.
కాని ఈ కాలం, శూన్యము ఎంతమాత్రం కాదు.
    పన్నెండవ శతాబ్దంలో కూడా సాహిత్యం వెలసింది.
ఈ కాలాన్ని శివకవి యుగం అంటాం. ముఖ్యంగా ముగ్గురు శివకవులు వల్ల ఈ యుగానికి శివకవి యుగం అని పేరు వచ్చింది. ఆ ముగ్గురు కవులు వరుసగా నన్నె చోడుడు, పాల్కురికి సోమనాథుడు,
మరియు మల్లికార్జున పండితారాధ్యుడు. శివ కవులలో ముఖ్యలు వీరే. అయితే శ్రీపతి పండితుడు మరియు యథావాక్కుల అన్నమయ్య వంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ కాలంలోని చాలామంది శివకవులు చరిత్రకెక్క లేక పోయారు.
దానికి కారణం, వీరు రాసిన తాళపత్ర గ్రంధాలు కాలగర్భంలో కలిసిపోవడము, మరికొందరు కవులకు ప్రచారం కూడా లేకపోయింది.శివ కవులలో మొదటివాడు నన్నెచోడుడు. ఈయన రాసిన గ్రంథం కుమారసంభవము. కవి రాజా శిఖామణి అని ఇతనికి బిరుదము కలదు. ఇతడు మొదటిసారిగా మార్గ దేశి కవితల ప్రస్తావన చేశాడు.నన్నెచోడుడు రాసిన కుమార సంభవానికి మూలం, కాళిదాసు రచన కుమారసంభవము.
    కుమార సంభవాన్ని నన్నెచోడుడు రాయలేదని వాదన కూడా ఉంది. ఈ వాదం కొర్లపాటి శ్రీరామ మూర్తి గారు చేశారు. దీనిని మానవల్లి రామకృష్ణ కవి
రాసాడని ఈయన అంటారు.
శివ కవులలో తదుపరి కవి పాల్కురికి సోమన.ఈయన బసవ పురాణము వృషాధిప శతకము, అనుభవసారం మొదలగు గ్రంథాలను రాశాడు.
  ఈయనను వీరశైవ కవిగా పేర్కొంటారు.
    పాల్కురికి సోమన తెలుగులోనే కాక కన్నడంలో కూడా సద్గురు రగడ, బసవ రగడ వంటి కావ్యాలు మరికొన్ని రాశాడు.
ఇతడు సంస్కృతంలో సోమనాథ భాష్యం, వృషభాష్ట కం. సంస్కృత బసవోదాహరణం, మొదలగునవి.
పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రము రాశాడు
      తరువాత శివ కవులలో పేర్కొనదగిన వాడు. పండితారాధ్యుడు. ఈయన రచనలు శివ తత్వ సారం. శ్రీగిరి శతకం. శివకవుల సమకాలికులలో
యథావాక్కుల అన్నమయ్య ఒకడు. ఈయన  అనేకం రాసినప్పటికీ, సర్వేశ్వర శతకం మాత్రమే లభ్యమవుతున్నది.
      ఈ కవులు శైవ మతాభిమానమే ధ్యేయంగా
కవిత్వం రాశారు. అందుకే వీరిని శివకవులని అన్నారు. ఈ యుగంలో తెలుగు భాషకి, దేశీ కవితకి
అత్యధిక ప్రాధాన్యథనిచ్చే రచనలు కావడం చేత, జనం నుండి మంచి ఆదరణ లభించింది. జనం కోసం కలం పట్టిన విలక్షణమైన కవులు వీరు. అందుకే పన్నెండవ శతాబ్దం వీరి పేరు మీదగా శివకవి యుగం అని పేరు వచ్చింది. అయితే వీరికి పరమత సహనం లేకపోవడం ఒక ఒక ముఖ్యమైన దోషం.(సశేషం)
  (104 వ భాగం)
    తెలుగు సాహిత్యం-శివ కవులు--  బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.


కామెంట్‌లు
తోయజ చెప్పారు…
విశ్లేషణ బాగుంది సార్
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం