విచిత్ర వేషాలు : డా. కె. ఎల్. వి. ప్రసాద్ , హనంకొండ,వరంగల్.

హై స్కూల్ జీవితం రాజోలులో (తూ. గో. జి)పాక్షికం గానే జరిగింది. అంటే 
కేవలం మూడు సంవత్సరాలు . ఆరు ,ఏడు ,ఎనిమిది ,తరగతులు అన్న-
మాట !ఆ .. మూడు  సంవత్సరాలూ గొప్పవీ ,గుర్తుంచుకోదగ్గవీనూ.అంటే 
హాస్టల్ లోవుండి చదూకోవడం అన్నమాట !సోమవారం నుండి శనివారం 
మధ్యాహ్నం వరకూ హాస్టల్ . శనివారం ఒంటిపూట బడివుండేది. అందు-
చేత,సాయంత్రానికల్లా ఇంటికి చేరుకునేవాళ్ళం కాలినడకన. మళ్ళీ సోమ-
వారం బయలుదేరి సరాసరి హాస్టల్ కు వెళ్లి ,అక్కడినుండి బడికి వెళ్లే వాళ్ళం . 
హాస్టల్ లో చాలా మంది దిగువ మధ్య తరగతి పిల్లలే ఉండేది. కొంతమంది 
దగ్గర మాత్రమే డబ్బులు ఉండేవి . ఎక్కువశాతం పిల్లల దగ్గర చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు . డబ్బులున్న పిల్లలు ఏవైనా చిరు తిండ్లు కొనుక్కు
ని ,తింటుంటే మిగతావాళ్ళు వాళ్ళ వంక చూస్తూ ఉండేవారు. ఆ ..బృందం 
లో నేనూ ఉండేవాడిని. ఒకోసారి పేదరికానికి ఏడుపు కూడా వచ్చేది. చాలా మంది పిల్లలు ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం 
చదువుకే ప్రాధాన్యత నిచ్చేవారు. 
ప్రతి అంశంలోనూ మంచి -చెడు ,అనేవి ఎప్పుడూ ఉంటాయి. అలాగే 
మంచి పిల్లలతో పాటు అల్లరి పిల్లలుకూడా ఉండేవారు. వీరు చదువు 
మీద అంతగా శ్రద్ధ చూపించేవారు కాదు ,పైగా బాగా చదువుకునేవాళ్ళకి 
ఇబందులు సృష్టించేవారు. అంతమాత్రమే కాకుండా దాదాగిరి చలాయించే
వారు. వాళ్ళ అల్లరి హాస్టల్ మేనేజర్ దృష్టికి వెళ్లనిచ్చేవారు కాదు. మేము 
రాత్రి భోజనం చేసిన తర్వాత ,9 గంటల వరకూ చదూకునె వాళ్ళం. పవర్ 
మెయిన్ ఆపేసేవాళ్ళు. పంకాలు (ఫ్యాన్ )ఉండేవి కాదు . అల్లరి బ్యాచ్ 
రెండో ఆట సినిమాకు వెళ్ళేవాళ్ళు . వాళ్ళు సినీమా చూసి తిరిగి వచ్చేసరి
కి ,మేము మంచి ఘాడ నిద్రలో ఉండేవాళ్ళం . అది గమనించి ఆ .. అల్లరి 
మూక ,మా మొలతాళ్లు కత్తిరించేవారు. ఎందుకు అలా చేసే వారో ఇప్పటి
కీ ,అర్ధం కాదు . మళ్ళీ ఇంటికి వెళితే తప్ప మొలతాడు కొనుక్కునే డబ్బులు ఉండేవి కాదు. ఇంకొందరు ,దీపం కిటికీ లో పెట్టి ,గోడమీద --
తయారైన మసి గీకి కొబ్బరి నూనెలో కలిపి ,నిద్రపోతున్న వాళ్ళ మూతు
లకి మీసాలు వేయడం ,వికృతమైన బొమ్మలు వేయడం చేసేవారు. ఉదయం లేచిన తర్వాత అందరూ చూచి నవ్వుతుంటే తప్ప అసలు ఏమి 
జరిగిందీ తెలిసేది కాదు. సబ్బు ఉండేది కాదు కాబట్టి ,ఎంతకడిగినా ఆ .. 
మసి ,ఓ పట్టాన పోయేది కాదు . అదొక పెద్ద సమస్యగా ఉండేది కాదు. 
ఎవరినీ అడిగే దైర్యం ఉండేది కాదు. నిశ్శబ్దంగా రోదించేవాళ్ళం అంతే .. !
                          ఇంకొంత మంది వేరే భిన్నమైన పని చేసేవారు. 
శీతాకాలం బాగా చలి పెట్టేది. కప్పుకోవడానికి కొంతమందికి దుప్పట్లు 
ఉండేవి కాదు. అందుకని దుప్పటి కప్పుకుని ఘాడ నిద్రలో ఉన్నవాళ్ళని 
గుర్తించి జాగ్రత్తగా ఆ .. దుప్పటి తీసుకుపోయి హాయిగా కప్పుకుని పడు-
కొనేవారు . మధ్యలో మెలుకవ వచ్చి చూస్తే మీద దుప్పటి ఉండేది కాదు. 
ఇక చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో !
ఇలాంటివి ఎన్నెన్నో బాల్యపు అనుభవాలు తవ్వేకొద్దీ బయట పడుతుం-
టాయి . అయితే అప్పటి అల్లరి తో ముడిపడి వున్నపిల్లలు చదువులు 
అనుకున్నంతగా సాగలేదు. జీవితంలో స్థిరత్వం కూడా వాళ్లకి ఏర్పడ--
లేదు. అప్పుడు నా లాంటి వాళ్లు కష్టపడినా ,తర్వాత చక్కగా జీవితంలో 
స్థిరపడడానికి మెండుగా అవకాశాలు దక్కాయి. అందుకు నేనే మొదటి 
ఉదాహరణ అవుతానేమో !ఎందుచేతనంటే ,నా బాల్యం అంతాఇబ్బందుల  
మయమే మరి !మంచి,ఆనందమయ  జీవితానికి క్రమశిక్షణే ముఖ్యమైన 
అంశంగా గమనించక తప్పదు .


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం