ఆ దెబ్బ భవిష్యత్తుకు హెచ్చరిక : - డా. కె. ఎల్. వి. ప్రసాద్ - హనంకొండ.

అవి నేను మా తాలూకా ప్రధాన కేంద్రం ‘రాజోలు ‘(తూర్పు గోదావరజిల్లా)
హైస్కూల్ లో చదువుతున్న రోజులు. ఆరవ తరగతి నుండి ఎనిమిదవ -
తరగతి వరకూ కోర్టు సముదాయానికి దగ్గరలో వున్న పాఠశాలలోక్లాసు--
లు ,జరిగేవి. తొమ్మిదవ తరగతి నుండి ఎస్. ఎస్. ఎల్. సి.,వరకూ 
రాజోలు చివర సావరం రోడ్డులో వున్న పాఠశాలలో క్లాసులు జరిగేవి. 
నేను ‘ఇన్ -టు -ఫస్ట్ ఫారం ప్రవేశ పరీక్ష రాసి ,చిన్న బడిలో అంటే --
ఆరవ తరగతిలో ప్రవేశం పొందాను . 
నేనూ -నాతోపాటు కొంతమంది రెండవ  తెలుగు బదులు ,సంస్కృతం 
పాఠ్యఅంశంగా ఎన్నుకోవడం వల్ల మా కొద్దీ మందిని ఆడవాళ్ళ సెక్షన్ లో 
వేశారు. ఓ పదిమంది మగపిల్లలు,మిగతావాళ్లంతా ఆడపిల్లలు ఉండేవారు
ఇది మగ పిల్లలకు ముఖ్యంగా ఏవరేజ్ పిల్లలకు చాలా ఇబ్బందిగాఉండేది. 
ఉపాధ్యాయులు అడిగిన దానికి సరైన సమాధానం చెప్పలేకపోతేఅందరు 
పక .. పక .. నవ్వేసేవారు . అది మగపిల్లలకు అవమానకరం అనిపించేది
       అలాంటి అనుభవం నాకు ఒకటి జరిగింది. ఇలాంటి అనుభవాలు 
బాల్యంలో చాలా మందికి ఎదురుకావచ్చు. అయితే అందరూ ఇలాంటి 
వాటికి పెద్దగా ప్రాధాన్యత నివ్వరు . అప్పటికప్పుడే మర్చిపోతారు,కానీ 
కొంతమంది సున్నిత హృదయులు ఇలాంటి అనుభవాలు మర్చిపోలేరు . 
జీవితాంతం తలచుకుంటారు,గుర్తు పెట్టుకుంటారు . ఈ రెండవ కేటగిరి కి 
చెందిన వాడిని నేను. 
మా బడిలో చదువుతోపాటు,డ్రాయింగ్ ,డిబేటింగ్ ,డ్రిల్లు ,చేతిపని ,వంటి 
వాటికి కూడా ప్రాధాన్యత నిచ్చేవారు. లైబ్రరీ క్లాసుకూడా ఉండేది. ఎక్కడైనా క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఈ నేపథ్యంలో వారం 
లో ఒకరోజు డ్రాయింగ్ కు కేటాయించేవారు. మా డ్రాయింగ్ మాష్టారు ను 
చూస్తే ,ఉపాధ్యాయుడి వస్త్రధారణ ఇలా ఉండాలి సుమా !అనిపించేట్టుగా 
ఉండేది. ఖద్దరు పంచ ,ఖద్దరు పొట్టి చేతుల చొక్కా ,భుజం మీద కండువా
చేతిలో అతి సాధారణ నార సంచి ,పక్కా గాంధీయ వాది లా (నిజంకూడా)
ఉండేవారు. సైన్యంలో పనిచేసి వచ్చిన వ్యక్తి. జిల్లాలో మొదటి విధవ --
వివాహం ఆయనే చేసుకున్నారట !
నాకు కొన్ని టెస్ట్ బుక్కులు,ఒక నోట్ బుక్ మాత్రం ఉండేది. మాస్టారిభయా 
నికి ,డ్రాయింగ్ పుస్తకమూ ,పెన్సిలూ ,అతి కష్టం మీద కొనుక్కున్నాను.
డ్రాయింగ్ మాస్టారి మొదటి క్లాసు లో ఏమేమి తెచ్చుకోవాలో చెప్పారు. 
తర్వాతి క్లాసులో ,మాష్టారు బోర్డుమీద బొమ్మ వేసి అది మమ్మల్ని డ్రాయింగ్ బుక్ లో గీయ మన్నారు. 
అందరం బొమ్మలు గీస్తున్నాం,అందరి బొమ్మలూ పరిశీలిస్తూ వస్తున్నారు
నా దగ్గరి కొచ్చి ఆగిపోయారు. నాబొమ్మను సరిచేసి అవసరం లేని గీతలు 
రబ్బరు (ఇరేజరు )తో చెరిపేయమన్నారు. నాలో కదలికలు లేకపోవడం 
గమనించి ‘’ర బ్బరు తేలేదా ?’’ అన్నారు. 
‘’ లేదు సర్ ‘’అన్నాను .
ఆయనకు చాలా కోపం వచ్చింది (నా .. పేదరికం ఆయనకు తెలీదు మరి)
వెంటనే బెంచ్ ఎక్కమన్నారు. బెంచ్ ఎక్కినతర్వాత ,చెంప మీద ఒక్క దెబ్బ చెళ్లు మనిపించారు. ఆయన కొట్టిన దెబ్బ తాలూకు బాధ కంటే ,ఆడపిల్లల మధ్య అవమానం భరించలేక పోయాను. అంతే మళ్ళీ ఎప్పుడూ డ్రాయింగ్ క్లాసుకు రబ్బరు మరచిపోలేదు !ఆ.. దెబ్బను నా మంచి భవిష్యత్తుకు ఒక హెచ్చరిక గానే భావించాను తప్ప ,అప్పుడూ 
ఎప్పుడూ బాధ పడలేదు ,మా డ్రాయింగ్ మాస్టారు శ్రీ హనుమంత రావు 
గారిని తలచుకుంటూనే ఉన్నాను. నాటి గురువులు గొప్ప మార్గ దర్శకులు మరి !!


                 


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం