తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి

తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగ బోడు
విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి
దాన ధర్మము లేక దాచి దాచి


తుదకు దొంగలకిత్తురో దొరలకవునో
తేనె జుంటీయదా తెరువరులకు
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర!!


నరసిమ్హ శతకం (1)


పుడుతూనే ఎవ్వరూ ధనం తీసుకురారు. అలాగే శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు, అప్పటివరకు మనం అనుభవించిన భోగ భాగ్యాలు- పదవులు ఏవీ వెంట వెళ్ళవు.
ఎంత డబ్బు సంపాదించినా మనిషి అన్న పానాలే భుజిస్తాడు కానీ- తను సంపాదించిన వెండి బంగారాలని ఆహారంగా తినడు.


ఇంత సంపాదించాను-అంత సంపాదించాను అన్న అతిశయమే కానీ, సంపాదించినదంతా ఎప్పుడూ అనుభవించలేరు. జీవితకాలమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము దాన-ధర్మాల ప్రసక్తి లేకుండా, ఇతరులకి తెలియకుండా అక్కడ దాచి, ఇక్కడ దాచి చివరికి దొంగలకి
అప్పచెబుతారు. అది ఎలా ఉంటుందంటే తేనెటీగ పువ్వు-పువ్వు దగ్గరకెళ్ళి ఎంతో కష్టపడి తేనె సంపాదిస్తుంది. ఆ తేనెని తానెప్పుడూ అనుభవించదు. తెలివైన మనిషి ఆ తుట్టెని కాల్చి ఈగలని చంపి అందులో తేనెటీగ దాచిన కష్టాన్ని తాను అనుభవించినట్టే, మనిషి జీవితకాల సంపాదనని ఎవరో వచ్చి దోచుకెళతారు అని కవి భావన.


ఆ భావాన్ని ఇంకా విపులంగా తెలియచేసే కధ ఇప్పుడు తెలుసుకుందామా!


*********


పరమేశ్వర రావు గారికి మామిడి పళ్ళంటే మహా ప్రీతి.
మామిడి పండ్ల మీద ఎవరికుండదు కనక కోరిక, చెప్పండి!


నూజివీడు నించి ఎవరో వస్తున్నారని రెండు బుట్టలు తెప్పించారు.
'మీ ఒళ్ళేమో ఓ షుగర్ ఫాక్టరీ! రీడింగ్స్ చూస్తే అన్నం తిన్నాక 400, తినకముందు 180.... అదేదో యావరేజ్ (Hba1c) 11-12 'అని భార్య కనకం ఒకటే మొత్తుకోవటం!


అబ్బే మన చుట్టు పక్కల నలుగురికీ ఇద్దామని తెప్పించాను కానీ, అన్నీ నేనే తింటానా ఏమిటి? అని ఓ అమాయకపు చూపు!


అంటుందే కానీ, పాపం భర్త జిహ్వ చాపల్యానికి - అతనికున్న ఆరోగ్య సమస్యలకి మధ్య ఉన్న అసమతుల్యానికి బాధపడుతూ ఉంటుంది.


పెళ్ళయిన కొత్తలో అన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నట్లే బరువు బాధ్యతలు.... తినగలిగే ఆరోగ్యం ఉన్నా .......కోరుకున్నవన్నీ కొనుక్కుని తినలేని ఆర్ధిక క్రమశిక్షణ.... ఇవన్నీ చూస్తూ కనకం, భర్తతో 'పోనీ లెండి.... కోరుకున్నవన్నీ తినలేకపోయినా.... నోటికి నాలుగు వేళ్ళూ వెళుతున్నాయి


".........................................
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగబోడు '


అన్ని పెద్దలన్నట్లు, ఈ జానెడు పొట్టకి ఎంత తింటే సరిపోదు?
మరు పూటకి మళ్ళీ వెతుక్కోవలసిందే కదా!
ఒక్క రవ్వ చేతులు కట్టేసుకోవలసి వచ్చినా, మీ తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వర్తించి....వారిని తృప్తిపరిచారు.!
అనుభవించలేని దాని గురించి అసంతృప్తి పడే కంటే గొప్ప స్థితిపరుడైనా తినేది ఆ అన్నమే కదా అని ఆలోచిస్తే సరిపోతుంది 'అని సర్దిచెప్పేది.


*******


పరమేశ్వర రావు స్నేహితుడు హరికృష్ణ తన తండ్రికి ఒక్కడే కొడుకు.
బోలెడు ఆస్తి....ఏభై ఎకరాల పొలం! పైగా తండ్రి వడ్డీ వ్యాపారం మీద బాగా సంపాదిస్తున్నాడు.
ఇంకా ఇంకా ఆస్తులు పోగేస్తున్నాడే కానీ....తను తినడు , ఇంట్లో వారిని సుఖపడనివ్వడు.
ఎంగిలి చేత్తో కాకిని తోలడు. ఇక దాన ధర్మాల ప్రసక్తెక్కడ!


హరికృష్ణ కూడా చిన్న చితకా వ్యాపారాలు చేసి కాస్తో కూస్తో సంపాదిస్తున్నాడు.
కానీ భార్య .....తమ పెళ్ళి రోజనో, పుట్టిన రోజనో పేరు చెప్పి ఒక నగ కొంటే ఇక ఇంట్లో యుద్ధమే!


'డబ్బంతా తగలేస్తున్నావనీ, మానాన్న చచ్చీ చెడి వడ్డీ వ్యాపారం చేసి సంపాదిస్తుంటే నువ్విలా ఒళ్ళూ పోయి తెలియకుండా ఖర్చు చేస్తావా 'అని చిందులేస్తాడు.
'ఓ నగ కొనుక్కోవటానికి లేదు! ఓ పట్టు చీర కొనుక్కోవటానికి లేదు' అని భార్య సింధు చిరాకు పడేది.


'డబ్బు సంపాదించేది....మనం అనుభవించటానికేనండి. కొంత మనం అనుభవించాలి, కొంత దానం చెయ్యాలి, మరి కొంత రేపన్న రోజుకి దాచుకోవాలి.పోతూ పోతూ మూటకట్టుకుపోము.' అని మా అమ్మ చెప్పేది.
'మనిషన్నాక జాగ్రత్త ఉండచ్చు, తప్పులేదు. కానీ పిసినారితనం పనికి రాదు.
ఏ అనుభవమూ లేని దానికి ఈ సంపాదనలెందుకు?' అని రోజు వారిద్దరి మధ్య వాగ్యుద్ధమే!


'మీ పెదనాన్న గారు చూడండి..... ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా వేంటనే తన ఇంటి నించి ధాన్యం, డబ్బు పంపి వెంటనే వారికి తనున్నాననే భరోసా ఇచ్చేవారు.'


'మొన్న తుఫాను వస్తే పది రోజుల పాటు ఊరందరికీ భోజనాలు తనింటి నించే పంపించి ఆదుకున్నారు.'
డబ్బుకి విలువ అలాంటి పనుల వల్లే పెరుగుతుంది.


ఆయన కాలం చేసినప్పుడు, ఊరు ఊరంతా ఒక్కటై వచ్చి ఆ పది రోజులు ఆయన ఇంట్లోవారికి ఎంతో పని సహాయం చేశారు! మీ అన్నయ్య ఎక్కడో దూరంగా అమెరికాలో ఉంటే, మీ పెద్దమ్మకి ఇప్పటికీ ఎంతో అండ దండలుగా ఉంటున్నారు!


""తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
............................
............................
విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి
దాన ధర్మము లేక దాచి దాచి


తుదకు దొంగలకిత్తురో దొరలకవునో
తేనె జుంటీయదా తెరువరులకు
భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర!!


'అని శతక కారుడు చెప్పినట్లు, మీరు బ్రతికున్నంతకాలం కూడ బెట్టిన సొమ్ము మీ తరువాత ఏమవుతుందో మీకు తెలుసా?'


'తేనెటీగ తన జీవితమంతా పోగేసిన తేనె, ఆ తుట్టెని కాల్చి ఈగలని చంపటం ద్వారా మనం అనుభవిస్తున్నట్లే, మీ తదనంతరం మీ ఆస్తి-డబ్బు ఇంకెవరో వచ్చి అప్పనంగా అనుభవిస్తారు.'


"తన్ను మాలిన ధర్మం చెయ్యమని" ఎవ్వరూ చెప్పరు.


'మీరు సంపాదించిన దానిలో కొంత లేనివారికి దానం చేస్తే, వారి జీవితాంతం మీ పేరు చెప్పుకుంటారు. మీకు పుణ్యం.' అని సింధు చెప్పగా చెప్పగా కొంతకాలానికి హరికృష్ణ ఆ ఊళ్ళో ఒక తుఫాను పునరావాస కేంద్రం, ఒక అనాధ శరణాలయం కట్టించే ఏర్పాట్లు చెయ్యటానికి సిద్ధపడ్డాడు.



కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
కథ చాలా బాగుంది
అజ్ఞాత చెప్పారు…
excellent story
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగుంది 🙏🙏🙏🙏
అజ్ఞాత చెప్పారు…
ఈ నరసింహ శతకము చెప్పినట్లు ఇలాంటి జీవిత సత్యాలు ప్రతి కుటుంబము లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. మేడం మామిడి పండ్లతో చాలా బాగా విశ్లేషణ చేశారు. 🙏🙏🙏🙏💐💐💐
అజ్ఞాత చెప్పారు…
Super story
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం