భాండ శుద్ధి లేని పాకమేలచిత్త శుద్ధిలేని శివ పూజలేలరావిశ్వదాభిరామ వినురవేమ"ఆచారాలతో ఉప్పూ నిప్పూ కడిగే వారు మనసులో చెడు తలంపులతో ఉంటే, ఆ ఆచారాలకి అర్ధం ఉండదు. అలాంటివారిని ఎవరూ గౌరవించరు. శుభ్రం లేని పాత్రతో ఎంత రుచికరమైన వంట వండినా అది వృధాయని కవి భావము.* * * * *"మామయ్య గారి పూజ అయినట్టుంది, కమలా భోజనం ఏర్పాట్లు చెయ్యమ్మా" అని పిలిచింది సువర్చల కోడలిని.పూజ కోసం కట్టుకున్న బట్టలు మార్చుకుని హాల్లోకొస్తున్న ఆంజనేయులు గారు, "ఆ అమ్మాయెందుకు? నువ్వే పెట్టచ్చుగా! ఆ అమ్మాయి చేత్తో ఎందుకు" అన్నారు."హుష్ ఊరుకోండి! వింటే బాధ పడుతుంది. మధ్యన ఆ అమ్మాయేం చేసింది? మీకు చాదస్తం, అతి ధోరణిఎక్కువయింది" అన్నది సువర్చల తగ్గు స్వరంతో!"చదివేది 'విశ్వం విష్ణుం...అని విష్ణు సహస్రనామం! ఆలోచనల్లో సంకుచితత్వం! దాని మేనమామ కొడుకు బావ మరిదిముస్లిం పిల్లని పెళ్ళి చేసుకుంటే మధ్యన అదేం చేసింది? అది మనింటికి కోడలిగా వచ్చి ఇప్పటికి 5-6 ఏళ్ళయింది. నిన్నటిదాకా ఆ పిల్లతో లేని పట్టింపు, ఆచారం ఇప్పుడొచ్చాయా?""ఎదుటి వారి వైపు మనమెందుకు వేలెత్తి చూపటం? అది కూడా...అస్సలు సంబంధం లేని వారి గురించి, మనింట్లోవారిని విమర్శించటం, వారి మనసు కష్టపెట్టటం మంచిది కాదు. మనం తప్పు చెయ్యకుండా ఉంటే సరిపోదా! మనసు, ఆలోచనలు పవిత్రంగా లేకుండా "సహస్ర శీరుషం దేవం విశ్వాక్షం..." అని పురుష సూక్తం చదివితే భగవంతుడుమెచ్చుతాడా?""నేను మాత్రం మడి కట్టుకుని, తోమని గిన్నెలో ఆ పాటునే వంట చేసి పవిత్రంగా దేవుడి నివేదనకి చెయ్యమని మీకిస్తేఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది" అన్నది."అవునులే, పాపం తనేం చేస్తుంది. ఏదో కమల వాళ్ళ నాన్న మాటల్లో విన్న విషయం వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాను. కమలా తప్పుగా అనుకోకమ్మా! పెద్ద తరం వాడిని కదా, కాస్త చాదస్తం, అంతే! వచ్చి వడ్డించు" అన్నారు."ఈ మధ్య మీ అత్తగారు తరచు నడుం నొప్పి అంటోంది. రేపు మా వాడు డాక్టర్ దగ్గరకి తీసుకెళతానన్నాడు. రేపుపొద్దున్న వంట నువ్వే చెయ్యి. నా దేవుడికి క్షమాపణలు చెప్పిమనసారా నైవేద్యం పెడతాను" అన్నారు మనస్ఫూర్తిగా!* * * *పొరుగింట్లో ఉండే గిరిజ, కమల మంచి స్నేహితులు. అన్ని విషయాలు ఇద్దరూ అరమరికలు లేకుండామాట్లాడుకుంటారు. ఆ రోజు ఇంట్లో జరిగిన సంఘటన కమల సాయంత్రం గుడికి వెళ్ళేటప్పుడు గిరిజతో అన్నది.అది కార్తీక మాసంలో చివరి సోమ వారం! సాయంత్రం ఆవు నేతితో దీపం వెలిగిద్దామని గిరిజ, కమల దేవాలయానికివెళ్ళారు. పక్కన నిర్దేశించిన మంటపంలో దీపం వెలిగించి నవగ్రహ ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కుని శివుడి ఎదురుగానిలబడ్డారు. గంట కొట్టి గోత్ర నామాలు చెప్పి అర్చన చేయిద్దామని నిలబడ్డారు. "పూజారి లోపలనించి వచ్చేసరికిఆలశ్యమయ్యేట్టుంది. ఇంటికెవరో వస్తామన్నారు, అత్తయ్య త్వరగా ఇంటికి రమ్మన్నారు" అన్నది కమల. వాళ్ళుబయలుదేరుదామనుకుంటుండగా, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఆదరా బాదరాగా వచ్చిన పూజారి గారు, హారతిపళ్ళెంలో భక్తులని తమ తమ అర్చన టికెట్స్ పెట్టమని కంటితో సైగ చేసి తన ఫోన్ సంభాషణ కొనసాగిస్తున్నారు.గిరిజకి ఇలాంటి విషయాల్లో పట్టింపు ఓ పిసరు ఎక్కువే అని చెప్పాలి. పూజారి గారి తంతు చూశాక, "నువ్వు త్వరగావెళ్ళాలన్నావు కదా, నడు వెళదాం" అని కమల చెయ్యి పుచ్చుకు లాగింది. "ఆయన వచ్చేశాడు కదా, గోత్ర నామాలు చెప్పిపూజ చేయించుకుందాం అన్నది కమల. "ఆయన ఏం చదువుతాడో, ఏమో? ఒకరి గోత్రం..ఇంకొకరి పేరు కలిపి చదవడనినమ్మకం లేదు! అలాంటి పూజ చేయించుకున్నా లేకపోయినా ఒకటే! మనసుకి తృప్తిగా దీపం వెలిగించుకున్నాం! కాసేపుఆ మారేడు చెట్టు కింద కూర్చుని లింగాష్టకం మనకి మనమే చదువుకుంటే నయం" అని గిరిజ కమలని అక్కడి నించిలాకెళ్ళింది.అప్పటి వరకు అక్కడ నిల్చున్న వాసు, వీరిద్దరినీ చూసి "నిజమేనండి, ఈయన ఎప్పుడూ ఇంతే! నోటితో మంత్రాలుచదువుతూనే, పళ్ళెంలో దక్షిణ వెయ్యమని, కంటితో సైగలు చేస్తూ ఉంటాడు. చిత్త శుద్ధి లేని ఈయన చేసే పూజల వల్లమనకి పుణ్యం రాదు సరికదా, ఉన్న మనశ్శాంతి కూడా పోతుంది అన్నాడు.
శతక పద్య కథ --ఎం బిందుమాధవి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి