బబచి తాతయ్య' నవల: శాఖమూరి శ్రీనివాస్ సమీక్ష


 తేజ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తన తోటి విద్యార్థి అయిన గిరి తేజాను ఎప్పుడూ భయపెట్టేవాడు. దానితో తరగతి లోని అందరూ తేజను పిరికిపంద గా జమ కట్టారు. ఒకసారి అతను పురాతన కొలను వద్దకు వెళ్ళాడు. అతనికి అక్కడ ఒక తాతయ్య కనిపించాడు. తేజ ఆ తాతయ్యను ఒక నక్క నుంచి కాపాడాడు. దాంతో అప్పటి నుంచి తాతయ్య, తేజ తాతా-మనవళ్లు అయ్యారు. తేజ తన పాఠశాలలో జరిగే విషయాల్ని తాతయ్యతో చెప్పేవాడు. గిరి తనను ఎలా ఆటపట్టిస్తాడో చెప్పాడు.  తాతయ్య మనవడి కోసం ఏదైనా చేయాలని అనుకొని ఒక చిట్కా చెప్పాడు. తేజ కూడా తాతయ్య కోసం రోజు ఇష్టమైనవన్నీ  తెచ్చేవాడు. తాతయ్య చిట్కాతో తేజా లో ధైర్యం వచ్చింది. ఒకసారి తేజ వాళ్ళ స్కూల్లో ఒక విహారయాత్ర పెట్టారు. తేజ కూడా ఆ విహారయాత్రకు వెళ్ళాడు. విహారయాత్రలో వాళ్లు దారి తప్పి అడవిలోకి వెళ్లారు. అక్కడ తేజాకు తాతయ్య చెప్పిన చిట్కా పనికి వచ్చింది. ఇంతకీ ఆ తాతయ్య ఎవరు? ఆయన చెప్పిన చిట్కా ఏంటి? అడవిలోంచి తేజ వాళ్ళు ఎలా బయటపడ్డారు? తెలియాలంటే  'బబచి తాతయ్య' నవల చదవాల్సిందే. 


కామెంట్‌లు