అది కలకత్తాలో ఓ నాటక మందిరంలో ఓ నాటకాన్ని ప్రదర్శిస్తున్న వేళ. ప్రేక్షకులునాటకం చూడటంలో మునిగిపోయారు.ఇంతలో ఉన్నట్టుండి వేదికపైఓ సన్నివేశం.ఆ సన్నివేశం ఏమిటంటే...నాటకంతో ఏ మాత్రం సంబంధం లేని కొన్ని పాత్రలు వేదికపై ప్రత్యక్షమయ్యాయి....దీంతో ప్రేక్షకులలో గందరగోళం.అప్పటివరకూ సాగిన నాటకంలో ఓ ముఖ్యపాత్రధారి ఎవరి దగ్గరో కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు.ఆ కారణంగా అప్పు తీసుకున్న నటుడిని అరెస్టు చేయడానికి బ్రిటీష్ పోలీసులు అరెస్టు వారెంటుతో వేదికపైకి రంగప్రవేశం చేశారు.ఈ విషయం క్షణాల్లో ప్రేక్షకులకు తెలిసింది. కానీ వారందరూ వేదికపై జరుగు తున్నదంతా మౌనంగా చూస్తున్నారు.అప్పుడు ఓ కుర్రాడు పోలీసులను చూసి గట్టిగా మాట్లాడాడు. ఆ గొంతు పోలీసులపై పిడుగుపడ్డట్టుగా ఉంది.ఆ కుర్రాడు ఏం చెప్పాడంటే"పోలీసులారా! వేదికపై నుంచి తక్షణమే వెళ్ళిపోండి...మీరు ఎవరినైతే అరెస్టు చేయాలనుకున్నారో అతనిని నాటకం ముగిసిన తర్వాత ఆ వ్యవహారం కానిచ్చుకోండి. నాటకం రసవత్తరంగా సాగుతుంటే వేదికపైకి వచ్చి ఇలా గందరగోళం సృష్టించడం సబబు కాదు. కనుక వేదిక దిగండి..."కుర్రాడి గొంతు సింహగర్జనలా ఉండి పోలీసులకు హెచ్చరికలా అనిపించింది.కుర్రాడి గొంతులో రవ్వంత భయం లేదు. మాటల్లో తడబాటు లేదు.ఆ మాటలు విని పోలీసులువిస్తుపోయి ఆ కుర్రాడి వంక చూస్తున్నారు.ఇంతలో ప్రేక్షకులు కూడా కుర్రాడితో తమ గొంతు కలిపి "పోలీసులారా! వేదిక దిగండి! నాటకం అయిపోయేంత వరకూ ఆగండి! ఆ తర్వాత మీరొచ్చిన పని కానివ్వండి!" అని గట్టిగా అరిచారు.దాంతో పోలీసులు చేసేదేమీ లేక వేదిక మీద నుంచి కిందకు దిగారు.సరైన సమయంలో ధైర్యంగా మాట్లాడిన కుర్రాడిని ప్రశంసించారు.ఈ సంఘటన జరిగేనాటికి ఆ కుర్రాడి వయస్సు పద్నాలుగేళ్ళు.తర్వాతి కాలంలో ఆ కుర్రాడు పెరిగిపెద్దవాడై "అనవసర భయాలు వద్దు!" అంటూ జాతికి పిలుపునిచ్చారు. ప్రజలను తమ ప్రసంగాలతో చైతన్యవంతులను చేశారు. చికాగో సభలో సోదరసోదరీమణులారా అంటూ తమ ప్రసంగాన్ని మొదలుపెట్టి యావత్ ప్రపంచ దృష్టినీ ఆకట్టుకున్న ఆయన ఎవరో కాదు, స్వామి వివేకానంద!
స్వామి వివేకానంద:-- యామిజాల జగదీశ్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి