ఈ పాట దేశభక్తి ప్రభోధకమైనది. బడిపంతులు సినిమాలోది. ఇది 1972 నవంబర్ 23వ తేదీన విడిదలైంది . నిర్మాత పి. పేర్రాజు. దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి. ఈ సినిమాలో సీనియర్ యంటీయార్ హీరో. ఆయనది ఒక బడి పంతులు పాత్ర. పిల్లలకు పాఠాలు చెప్పే ప్రక్రియలో భాగంగా దేశభక్తితో కూడిన ఈ పాటను పాడి కొరస్ గా పిల్లలతో పాడించాడు. ఈ పాటను ఆచార్య ఆత్రేయ రాశారు. కె.వి.మహదేవన్ బాణీ కూర్చారు. ఘంటసాల, సుశీల పాడారు.ఈ పాట ద్వారా పిల్లలు ఎన్నో నేర్చుకోవచ్చు. ప్రతి పదం నుండి వారు విజ్ఞానం పొంద వచ్చు. మేధావి అంటే అన్ని విషయాలు తెలిసున్నవాడే. ఈ పాట నేర్చుకోవడం ద్వారా మీరు అనేక కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ తోటి పిల్లలకు తెలియనివి ఈ పాట నేర్చుకున్నా మీకు మాత్రమే తెలుస్తాయి . దీనితో మీరు మేధావుల కోటాలోకి వెళ్లి పోతారు.భారత మాతకు జేజేలు పలుకుతూ మన మంతా దేశభక్తిని కలిగి ఉండాలని, భారతదేశం గొప్పతనం గురించి మాష్టారు పిల్లలకు ఈ పాట రూపంలో చెబుతున్నాడు. త్రివేణి సంగమం, నాలుగు వేదాలు, గీతామృతం, పంచశీల అనే నాలుగు ప్రాముఖ్యమైన అంశాల విజ్ఞానాన్ని మొదటి చరణంలో కవి మనకు వివరించాడు. ఆవేమిటో మీ పెద్దలను అడిగి తెలుసుకోండి. రెండో చరణంలో శాంతిదూత, జాతిరత్నం, విప్లవవీరులు, వీరమాతలు అనే విషయాలను తెలియజేసారు. ఈ నలుగురి గురించి కూడా తెలుసుకోండి. మూడో చరణంలో సహజీవనం, సమభావనం,సమతావాదం, వేదం అనే విషయాలను కవి తెలిపారు. వీటి అర్ధాలను కూడా మీరు పెద్దలను అడిగి సమాధానాలు రాబట్టండి. ఇవి తెలుసుకుంటే బోల్డంత విజ్ఞానం మీ సొంతం అవుతుంది. మీ తోటి పిల్లల కంటే మీరు చాలా మెరుగ్గా వుంటారు. పాటను మొత్తం బట్టీ పెట్టేయండి. పాట వస్తుంది. పాటతో పాటు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇక పాడండి. యూ ట్యూబ్ లో పాటను వెదుక్కోని ట్యూన్ కు అనుగుణంగా వారితో గొంతు కలిపి మీరు కూడా పాడండి.( రేపు పాట.)
భారతమాతకు జేజేలు౼ దార్ల బుజ్జిబాబు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి