ఆ ద్రావణం పింక్ రంగులోకి ఎలా మారింది: ౼ దార్ల బుజ్జిబాబు


 ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటే వారిని అవినీతి నిరోధక  శాఖ  (ఎసిబి) అధికారులు పట్టుకుని వారి చేతులను ఓ ద్రావణంలో ముంచుతారు. ఆ ద్రావణం పింకు రంగులోకి మారితే వారు లంచం తీసుకున్నట్టు. మారకపోతే  తీసుకోనట్టు లెక్క. ఇదెలా జరుగుతుందో చూద్దాం. 

       ఏసీబీ అధికారులు బాధితుల‌కు ముందుగానే క‌రెన్సీ నోట్లు ఇస్తారు.   వాటిని ఉద్యోగుల‌కు లంచంగా ఇవ్వ‌మంటారు. ఈ క్ర‌మంలో ఏసీబీ వారు ఆ క‌రెన్సీ నోట్ల‌కు ముందుగా ఫినాఫ్త‌లీన్ అనే పౌడ‌ర్‌ను రాస్తారు. ఆ పౌడ‌ర్ మ‌న క‌ళ్ల‌కు క‌నిపించ‌దు. బాధితులు ఆ నోట్ల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇవ్వ‌గానే ఏసీబీ వారు దాడి చేసి ఆ ఉద్యోగుల‌ను అదుపులోకి తీసుకుంటారు. అనంత‌రం వారి వ‌ద్ద ఉండే లంచం ఇచ్చిన కరెన్సీ నోట్ల‌ను స్వాధీనం చేసుకుంటారు.

          త‌రువాత ప్ర‌భుత్వ అధికారుల చేతుల‌ను ఒక ప్ర‌త్యేక‌మైన మిశ్ర‌మంలో ముంచుతారు. దాన్ని సోడియం బైకార్బొనేట్ మిశ్ర‌మంగా పిలుస్తారు. అయితే ప్ర‌భుత్వ అధికారులు క‌నుక లంచం తీసుకుంటే ఆ క‌రెన్సీ నోట్ల‌ను ముట్టుకుంటారు క‌దా, అలాంట‌ప్పుడు ఆ నోట్ల‌కు ఉండే ఫినాఫ్త‌లీన్ పౌడ‌ర్ వారి చేతుల‌కు అంటుకుంటుంది. ఈ క్ర‌మంలో వారు సోడియం బైకార్బొనేట్ మిశ్ర‌మంలో చేతులు ముంచ‌గానే ఆ మిశ్రమం కాస్తా పింక్ రంగులోకి మారుతుంది. అంటే వారు లంచం తీసుకున్నార‌ని చెప్పేందుకు పింక్ రంగులోకి మారిన ఆ మిశ్ర‌మ‌మే సాక్ష్య‌మ‌న్న‌మాట‌. 

       అయితే లంచం తీసుకోక‌పోతే క‌రెన్సీ నోట్ల‌ను ముట్టుకోరు క‌నుక వారి చేతుల‌ను ఆ మిశ్ర‌మంలో ముంచినా ఆ మిశ్ర‌మం పింక్ క‌ల‌ర్‌లోకి మార‌దు. ఇది అస‌లు లాజిక్‌..!  

           దీనిలో ఉన్న సైన్సు ఏమిటంటే పినాఫ్తాలిన్  పౌడర్ గానీ ద్రావణం గానీ క్షర గుణం కలిగిన వానితో సంయోగం చెందితే  పింకు రంగులోకి మారుతుంది. సోడియం బైకార్బోనేట్ క్షర గుణం కలిగిన ద్రావణం కనుక పింకురంగులోకి మారిందన్నమాట.

కామెంట్‌లు