రాజ్యాంగం(పాట‌)--అన్నాడి జ్యోతి--సిద్దిపేట

 ప్రపంచాన అతిపెద్ద రాజ్యాంగ రచన మనదిరా....
లిఖించాడు అంబేడ్కర్ అద్భుతంగరా....
రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాశాడురా....
అందులోన విధులనూ,హక్కులనూ పొందుపరిచి
నీతీ  న్యాయం ధర్మం చట‌్ట‌మంటూ....
అన్నింటి సారాన్ని వ్యక్తీకరించాడు.
దేశభవితనంతగూడ అందులోన నిలిపాడూ
భావితరాలకతండు బాట‌ను చూపించాడు.
స్వేచ్ఛా సమానత్వాల సమాహారమై
దేశప్రజలు బ్రతకాలీ దేదీప్యంగా....
భారతావనియంతా బాధ్యతతోడ
ప్రగతి పథమువైపు కదిలి సాగాలిరా....
గణతంత్రరాజ్యమంటు గర్వించరా....
స్వర్ణభారతీయంట‌ూ నినాదించురా....
జెండాను ఎగురవేసి జైకొట‌్టురా....
దేశభక్తి చాటాలీ ప్రతీచోట‌రా!!2!!
 
కామెంట్‌లు