లిఖించాడు అంబేడ్కర్ అద్భుతంగరా....రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాశాడురా....అందులోన విధులనూ,హక్కులనూ పొందుపరిచినీతీ న్యాయం ధర్మం చట్టమంటూ....అన్నింటి సారాన్ని వ్యక్తీకరించాడు.దేశభవితనంతగూడ అందులోన నిలిపాడూభావితరాలకతండు బాటను చూపించాడు.స్వేచ్ఛా సమానత్వాల సమాహారమైదేశప్రజలు బ్రతకాలీ దేదీప్యంగా....భారతావనియంతా బాధ్యతతోడప్రగతి పథమువైపు కదిలి సాగాలిరా....గణతంత్రరాజ్యమంటు గర్వించరా....స్వర్ణభారతీయంటూ నినాదించురా....జెండాను ఎగురవేసి జైకొట్టురా....దేశభక్తి చాటాలీ ప్రతీచోటరా!!2!!
రాజ్యాంగం(పాట)--అన్నాడి జ్యోతి--సిద్దిపేట
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి