పాఠాలు చెప్తాను: -- యామిజాల
 బాలగంగాధర్ తిలక్! ఆయనను అందరూ లోకమాన్య అని పిలుస్తారు. భారత దేశ స్వేచ్ఛా వాయువులకోసం ప్రప్రథమంగా గళమెత్తి ఉద్యమించారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ! 
ఆయనను ఓమారు ఓ విదేశ పాత్రికేయుడు కలిసి భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే "మీరు ఏ పదవిని తీసుకుంటారు? ప్రధాని పదవా? హోమ్ శాఖా? ఆర్థిక శాఖా? లేక హోంశాఖతోపాటు అర్థికశాఖకూడానా?" అని ప్రశ్నిఃచారు.
అప్పుడు లోకమాన్య ఇచ్చిన జవాబు...
"నాకు ఏ పదవీ వద్దు. నేనసలు పదవుల గురించి ఆలోచించను. నిజంగానే నా ఉద్యమం గెలిచి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధిస్తే నేనొక కుగ్రామంలో ఓ పాఠశాలలో పిల్లలకు లెక్కల పాఠాలు చెప్పే మాష్టారుగా ఉండాలనుకుంటాను. పాఠాలు చెప్పడంలోని ఆనందం మరెందులో ఉంటుంది?" అని!
కామెంట్‌లు