వీర బోయినపల్లి గ్రామం లో పూటకూళ్ళ పేదరాశి పెద్దమ్మ అనే శైవమతస్తురాలు నివసిస్తుండేది. ఆమెకు ఇద్దరు కవల పిల్లలు. పెద్దవాడు భూపాలుడు, చిన్నవాడు గోపాలుడు. ఇద్దరిని పెద్ద చదువులు చదివించాలని ఆ ఆ తల్లి ఆరాటం. కానీ కానీ ఆ దిశలో ఆ పిల్లల ప్రవర్తన సరిగాలేదని గ్రహించిన ఆ తల్లి పక్కనే ఉన్న ప్రజ్ఞా పురం లో ఉన్న గురుకులానికి తీసుకెళ్లి చదువు చెప్పమని పరంధామయ్య గురువును కోరింది. పిల్లల జ్ఞానాన్ని పరిశీలించిన గురువు, పెద్ద వానికి చదువు అబ్బుతుంది. చిన్నవానికి చదువు అస్సలు వంట పట్టదు. అందువలన పెద్దవాన్ని గురుకులం లో చేర్చుకున్నాడు. చిన్నవాడిని తిరస్కరించాడు. గత్యంతరం లేక ఆ తల్లి పెద్దవారిని చేర్చి చిన్నవాడిని వెంటపెట్టుకొని స్వగ్రామానికి తిరిగొచ్చింది.
పాపం ఆ తల్లి ఎప్పటికప్పుడు పెద్ద వాని చదువు అభివృద్ధి తెలుసుకుంటూ, చిన్న వాని విషయంలో తెగ విచారం చేస్తూ జీవనం గడుపుతున్నది. అనుకోకుండా ఒకరోజు"మాతా!భిక్షాందేహి"అంటూ ఓ సాధువు అరుస్తూ తన ఇంటి వాకిట ముంగిట నిలుచున్న వైనాన్ని గమనించి లోపలికి రండి స్వామి! అంటూ ఆహ్వానించింది. ఆ స్వామికి కడుపార భోజనం వడ్డించింది. భుజించిన స్వామి ఆమె వైపు ఓసారి చూసి, మాతా! నిన్ను చూస్తుంటే నీవు ఏదో సమస్యతో సతమతమౌతున్నట్లున్నావు. విడమరచి నాకు చెబితే నీ సమస్యకు పరిష్కారం చెబుతా., అనగానే ఆ తల్లి తన చిన్న కొడుకు విషయం తేటతెల్లం చేసింది. అంతలోనే గోపాలుడు అక్కడికి రావడం చూసి ఆ స్వామి ఆ పిల్లవాని హస్తం తన చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించాడు."తల్లీ! నీవు చింతించవలసిన పనిలేదు. నీ బిడ్డ డు మహర్జాతకుడౌతాడు. ఈతనికి రాజయోగం ఉంది. నేనొక రక్షరేఖ ఇస్తా. దాన్ని బాలుడి మెడలో సదా ఉండేటట్టు చూసుకో, అంతేగాక నేనిచ్చే ఈ శివలింగానికి రోజు పూజలు చేయమ్మా. వచ్చే శివరాత్రి నాటికి నీవు నీ బిడ్డ తో కాశీ చేరుకుని ఆ కాశీ విశ్వనాధుని పూజిస్తే నీకు అంతా మంచే జరుగుతుంది. అని సాధువు చెప్పాడు.
శివరాత్రి రానేవచ్చింది పేదరాశి పెద్దమ్మ సాధువు చెప్పిన ప్రకారంగా గోపాలు ని తీసుకుని కాశి
చేరుకుంది. కాశీ విశ్వనాధుని పూజించి తీర్థప్రసాదాలు తీసుకొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. ప్రయాణ బడలికతో కుంతల రాజ్యం సరిహద్దులో ఉన్న శివాలయములో కొడుకు తో పాటు వి శ్రమించింది. రాజాజ్ఞ ప్రకారంగా సైనికులు ఆ దేవాలయంలో విశ్రమించిన ఆ తల్లి కొడుకుల ను కనుగొని వారిని తీసుకెళ్లి రాజుకు అప్పజెప్పారు.
మరునాడు ఉదయం రాజు ఆ తల్లి కొడుకుల తో "మీరు కంగారు పడొద్దు. నేను చెప్పేది కాస్త వినండి. నేను నేను ఈ కుంతల దేశానికి రాజును. నాకు ఒకే ఒక బిడ్డ. ఆ బిడ్డ అంధురాలు. అంతేగాక పైగా మూగది. వివాహ వయస్సు వచ్చినందున వివాహంకై ప్రయత్నిస్తున్నాం. కానీ ఎవ్వరు కూడా వివాహ మాడుటకు ముందుకు రాలేదు ఒక సాధువు కాశీ విశ్వనాధుని మనసారా పూజిస్తే ఆ స్వామి కరుణించి మా కోరిక తీరుస్తాడని, నా బిడ్డకు భర్త లభిస్తాడని చెప్పాడు. ఆ ప్రకారంగానే ఇన్నాళ్లు ఆ విశ్వేశ్వరుని పూజించా. ఆ పూజాఫలం గా రాత్రి కలలో ఆ స్వామి "రాజా మీ రాజ్య సరిహద్దు దేవాలయంలో ఓ తల్లి తనయుడు ఉంటారు ఆమె తనయుడే నీ కుమార్తెకు భర్త అని చెప్పాడు. అందుకే మిమ్మల్ని రప్పించా. అది రాజు విషయం తేటతెల్లం చేశాడు.
రాజు మాటలు విన్న పేదరాశి పెద్దమ్మ తన ఇంటికి వచ్చి దీవించి పోయిన సాధువు, రాజుకు తటస్థ పడ్డ సాధువు ఒకటేనని గ్రహించి రాజుగారి మనవిని ఒప్పుకొని రాజకుమారితో తన తనయుని వివాహం జరిపించింది. రాజకుమార్తె మెడలో మంగళసూత్రం పడగానే ఆమెకు కళ్ళు, నోరు వచ్చినందుకు అంతా సంతోషించారు. కులంలోని తన అన్నను పిలిపించుకొని గోపాలుడు అన్న సహాయసహకారాలతో రాజ్యాన్ని ఏలుతూ ఆ దేశ ప్రజల్లో మంచి వేరు స్థిరంగా చరిత్రలో నిలబెట్టుకున్నాడు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి