ఒక మోసకారి నక్క అడవిలో పరుగు పెడుతూ ఒక ఊబిలో దిగబడిపోయింది . అది ఎంత ప్రయత్నించినా దాని నుండి బయటపడలేదు .చివరికి తనకు చావు తప్పదని ఇతర జంతువులతో గట్టిగా కాపాడమని అరచింది .
చివరకు ఒక కుందేలు దాని అరుపులు విని జాలిపడి దానిని కాపాడుటకు వెళ్ళింది. దూరంగా నిలబడిన కుందేలు ఆ ఊబిలో దేనినైనా పట్టుకొమ్మని చెప్పింది . కానీ నక్కకు అక్కడ పట్టుకొనుటకు ఏమీ దొరకలేదు. అప్పుడు కుందేలు ఒక త్రాడును తెచ్చి ఒడ్డున గల చెట్టుకు గట్టిగా దాని కొసను ముడి వేసింది. మరొక కొసను ఊబిలోనికి విసరివేసింది .నక్క ఆ త్రాడును పట్టుకుని బయటకు వచ్చి కుందేలుకు కృతజ్ఞతలు తెలిపింది.
ఆ తదుపరి అడవి జంతువుల సమావేశంలో నక్క కుందేలు తనకు చేసిన సహాయాన్ని తెలిపి , తనను కాపాడింది ఒక చెట్టు అనీ , దానికి త్రాడును కట్టడం వల్లనే తను బ్రతికి బయట పడినానని చెప్పింది . అప్పుడు జంతువులన్నీ ఈరోజు నుండి మనం చెట్ల ఆకులు, కాయలు ,పండ్లు తినాలి తప్ప చెట్టు వేర్లను ఏమీ చేయకూడదనీ, వాటిని కాపాడాలనీ , మానవుల్లాగా వాటిని నాశనం చేయవద్దనీ , అవి ప్రాణదాతలనీ తీర్మానించాయి.కావున పిల్లలూ! చెట్లు ప్రాణదాతలు.అందుకే వాటిని మనం కాపాడాలి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి