బేతాళ మాంత్రికుని మందు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

       రాణి గారికి కడుపులో నొప్పి వచ్చింది.
       ఏమి చేయాలో తోచక రాజు కాలుగాలిన పిల్లిలా తిరిగాడు.
       రాణి తోక తెగిన ఎలుకలా ఎగురుతుంది. 
       రాజవైద్యుడు రాజహంస వచ్చింది. 
       రాణి సింహం అవస్థ చూసింది. 
       మందులు, మాకులు ఇచ్చింది. 
       నొప్పి ఎక్కువ అయిందేగానీ కొంచమయినా తగ్గలేదు.
       హంసకు ఓ ఆలోచన వచ్చింది. 
       “మహారాణి! మీరేమి దిగులు పడకండి. 
        మంత్రాల దీవిలో బేతాళ మాంత్రికుడు ఉన్నాడు. 
       అతడు ఇచ్చే మందుకు తిరుగే ఉండదు. 
       ఉండండి ఇప్పుడే తేస్తా" అని రాజహంస రయ్యిన ఎగిరిపోయింది.
        కొంత సేపటికి తిరిగి వచ్చింది. 
        చేతిలో పొట్లం విప్పింది.
        పొడుంను పాలలో కలిపింది. 
        రాణిచే తాగించింది. 
        అద్భుతంగా మందు పనిచేసింది. 
        రాణి కడుపు నొప్పి పోయింది.
        రాజు ఆశ్చర్యపోయాడు. 
        హంసను మెచ్చుకున్నాడు. 
        “హంసా! హంసా!! అది సరేగానీ, ఇంత తొందరగా ఆ మందు ఎలా తెచ్చావు?   
        మంత్రాలు దీవి వెళ్ళాలంటే మాటలా? 
        బేతాళ మాంత్రికుడు మాములు వారికి మందులే ఇవ్వడే. 
        నీ వెలా తెచ్చావు?" అని అడిగాడు.
        హంస నవ్వింది.
        "రాజా! నేను తెచ్చింది బేతాళ మాంత్రికుని మందు కాదు, గీతాళ మాంత్రికుని మందు కాదు. 
        మా పోయిలోని బూడిద. 
        ప్రస్తుతానికి అది ఇవ్వక తప్పలేదు. 
        రాణి గారి కడుపునొప్పికి పనిచేసింది.
        బేతాళ మాంత్రికుని మందు కాదు. 
        నమ్మకం అనే మందు. 
        ముందు నేను ఇచ్చిందే అసలయిన మందు" అంది హంస. 
       హంస తెలివికి మృగరాజు సింహం ముక్కుమీద వేలేసుకుంది.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం