శ్రీరామనవమి కవితా వసంతోత్సవ వేడుకలు జోర్దార్ దినపత్రిక, పరిమళం సాహిత్య దినపత్రిక, నేత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ ద్వారా కవిసమ్మేళనంలో పాల్గొన్నందుకు ( శ్రీరామనవమి 2021 ) పురస్కారాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు అందించారు. ఇటీవలే జోర్దార్ జాతీయ సామాజిక సాంస్కృతిక తెలుగు దిన పత్రిక వారు నిర్వహించిన ఉగాది ( ప్లవ నామ సంవత్సర ) పురస్కారాలు 2021. కవితా పోటీలలో పాల్గొని ప్రతిభ కనపరిచినందుకు, ప్రశంసాపత్రాన్ని అందజేసి, శీల్డ్ తో సంస్థ వ్యవస్థాపకులు సత్కరించారు..
" సాహిత్య కళానిధి " బిరుదును డాక్టర్ చిటికెన కు ప్రధానం చేసిన సాహితీ బృందావన విహార జాతీయ వేదిక
---------------------
సాహితీ బృందావన విహార జాతీయ వేదిక ఖమ్మం, తెలంగాణ.. వారు ప్రతిష్టాత్మకంగా జాతీయ ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారాలు నిర్వహించారు. 2021 కి గాను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువ సాహితీవేత్త డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను ఎంపిక చేసినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. సాహిత్యంలో విశిష్ట సేవలు అందిస్తున్న యువ సాహితీవేత్తల లో ప్రత్యేకంగా తన రచనలు కొనసాగు తున్నాయని అందుకు * సాహిత్య కళానిధి * బిరుదును అందిస్తున్నట్లు గా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు నెల్లుట్ల సునీత తెలియజేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి వాకిటి రామ్ రెడ్డి, కోశాధికారి పసునూటి సాయి తరుణ్, గౌరవ సలహాదారులు ఏనుగు నరసింహారెడ్డి ( అడిషనల్ కలెక్టర్ ), శ్రీ పొట్లూరి హరి కృష్ణ తదితరులు కిరణ్ కుమార్ ను అభినందించారు..
కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేటి కాలంలో సాహితీవేత్తలకు ప్రతిభా పురస్కారాలు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని, సమాజసేవలో భాగం అవుతున్న సాహితీవేత్తలను గుర్తించి
పురస్కారాలు అందించిన సాహితీ సంస్థలకు డా. చిటికెన కిరణ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి