"పిల్లలే దేవుళ్ళు". మినీ కథ:-పి.చైతన్య భారతి:


 ఒక ఊరిలో ప్రభుత్వ బడిలో 200 మంది విద్యార్థులు,10మంది ఉపాధ్యాయులు ఉండేవారు.పిల్లలు రోజూ వేళకు బడికి వచ్చి ఉపాద్యాయులు చెప్పే పాఠాలను శ్రద్దగా వింటూ,ఆట పాటల్లో ,చదువులో ముందంజలో ఉండేవారు.విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయుటకు ఇద్దరు ఆ గ్రామస్థులే వచ్చి వండి వడ్డిస్తూ ఉండేవారు.

     అలా రోజులు గడుస్తున్న కొద్దీ వారిలో స్వార్థ బుద్ది పెరిగి,పిల్లలకు వండే భోజనంలో తగిన ప్రమాణాలు పాటించకుండా చేసేవారు.ఉపాధ్యాయులు ఎంత చెప్పినా వారిలో మార్పు గగనమయ్యేది.

   పెద్ద పిల్లలు కూర బాగా లేదని వారికి ఎదురు తిరిగితే వారిపై శాపనార్థాలు పెట్టేవారు.

   ఉపాధ్యాయులు తరగతి పనుల్లో ఉన్నప్పుడు వారి కళ్ళు గప్పి ,కూరలు తీసి దాచుకొని ,వాటిల్లో నీళ్లు పోసి వడ్డించడo చేసేవారు. ఉపాధ్యాయులకు కోపం వచ్చి వారిని తొలగించారు.

   కొంతకాలం తర్వాత ఆ తొలగించిన ఇద్దరిలో ఒకామెకు ఒక్కతే మనుమరాలు. అందాల బొమ్మ.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అనుకోకుండా తీవ్రమైన జ్వరం బారిన పడి ఆసుపత్రికి వెళ్ళే లోపల చనిపోయింది.దానితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగి పోయింది. కొన్ని రోజులకు ఆ వంటామే బడికి వచ్చి బోరుమని ఏడ్చింది.

   అప్పుడు ఉపాధ్యాయులు ఇలా చెప్పారు.'చూడమ్మా నీవు ఎన్ని సార్లు చెప్పినా పిల్లలకు సరిగా భజనం వండి పెట్టడానికి నీ మనసు ఒప్పలేదు.పసిపిల్లల కడుపు కొట్టి,స్వార్థ బుద్ధితో నీవు లాభ పడాలని చేసావు.మన బడిలో నిరుపేద పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం వారికి ఇచ్చిన విధంగా వారికి వండి పెట్టడం మన ధర్మం.ఒకరికి అన్యాయం చేయాలని చూస్తే ఏదో రూపంలో అదే మనకు తిరిగి వస్తుంది."అని చెప్పగా ఆమె తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందింది.ఇంకెప్పుడు అలా చేయనని వాటికి మాటిచ్చింది.


*నీతి:చేరపకురా చెడేవు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం