ఇష్టం !!:-కె ఎస్ అనంతాచార్య

ఈ  భావన ఎలా జన్మిస్తుందో  
బంధమై చుట్టుకొని  మాలికలా గుబాలిస్తుందో ?
మూలమెవరికి
అంతు పట్టటం లేదు     !
నిర్వచనానికి పదాలు తడబడుతున్నాయి!

వాక్యాలు కుదరలేదు 
పద్య పాదాలు గతి తప్పుతున్నాయి
వ్యాకరణం  రణం చేస్తోంది
ఇష్టానికి  అనుమతులు లేవు 
హద్దులు చీల్చుకుంటూ వచ్చి పొద్దుపొడుపు మీద
విచ్చుకున్న మనసు పత్రం

కనుబొమలెగరేసి
 కాటుకతో కబురంపే 
నయన సందేశం ! 

వేళ్ళకు అద్దుకున్న
గోరింటాకులో మూటగట్టుకున్న 
మురిపాల ముదిత విన్నపం 

తోడుగ నిలిచి కలబడే 
హక్కుల  జండా మీది
సూర్యుడి చిత్రపట సోపానంలోని
 వెలుగు నిచ్చెన

వేసే అడుగు మీద 
చేసే మువ్వల సవ్వడిలో
ప్రతిధ్వనించే పడతి పద
కింకిణీ రవాలు

కలల రాత్రి మీద వెన్నెల 
సోయగాల్లో చంద్రుడి 
దోబూచులాటలో సిగ్గు పడ్డ ఎర్ర బుగ్గలు

ఎదిరి చూపుల మీద
విసుగు పాటతో
హృదయ నివేదనం  

ఆరాధన, ఆత్మీయత
తపన,తనుకులాట
ముడి వేసుకొని  వచ్చిన  కుచేలుడికి పరమాత్ముని
అటుకుల మూట

రంగు నల్లకలువే 
రూపం తోసిరాజి
లెక్కలహద్దులు దాటి తెప్ప మీద తేలియాడే  అంతరాత్మ సోయగం 

అభివ్యక్తులు
ఆరున్నోక్కరాగలలో  వినపడే జయదేవుడి అష్టపది ఇరువురి పరస్పరాధిత ఇష్టపది

మెప్పుకోలు, ఒప్పుకోలుకు తలలు వంచక  
రాజీలేని మనసు రంగులరాట్నం మీద పలికే చిలుక


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం