పుస్తకనేస్తo - అందరి ఆనందములే ---- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
గొడ్లకాడ బుడ్డోడుకి మాపటిదాకా తోడు 
అంగన్వాడీ అయ్యోరమ్మ ఇచ్చిన 
అచ్చరాల పుస్కo,పలక 
తోటల్లో కాయలేరే పన్నెండేళ్ల 
లచ్చిమికి కాలక్షేపం సందమామ బొమ్మలపుస్తకం 

ఇంటెడుపని ఇంచక్కా
ఊర్మిళానిద్రనో కాంభోజరాజు కథనో 
పాడుకుంటా చేసే బామ్మకి 
నాల్గు మెతుకులు తిని 
వంట వసారాలో చల్లగాలికి 
తుంగచాపమీద పీట తలకింద 
పెట్టుకొని.. 
ఏనుగుల వీరాస్వామయ్య గారి 
కాశీయాత్ర చరిత్ర చదువుతూ 
మళ్ళీ కాఫీల దాకా కునుకు !

అనుకోని ప్రయాణంలో 
విసుగొచ్చేసింది విశ్వనాధకి 
బ్యాగ్ లో అగాథాక్రిస్టీ నవలతో 
బోలెడు సస్పెన్స్,టైమ్ పాస్!

ప్రక్క పల్లెలో టీచర్ ప్రభావతి 
లీజర్ పిరియడ్ లో అబ్బూరి 
ఛాయాదేవి తనమార్గంలో నే.. 
వైవిధ్యం కోరే సుచిత్రకి 
పరవస్తు లోకేశ్వర్ "సిల్క్ రూట్స్ "ఉండనే ఉంది !

ఎవరికి మింగుడు పడని 
కొత్త పీజీ కుర్రాడు.. 
చేతిలో.. 
"అతడు అడవిని జయించాడు"  
పక్కన ఉన్న పద్మశ్రీ చదువుతుంది "తండ్రులు -కొడుకులు "ఇ. తుర్గేనివ్ రచన 
సోవియట్ రష్యా కన్నీటికథ!
అందరికి ఆనందం ఇచ్చే.. 
పుస్తకం నిత్య భూపాలరాగం!



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం