ప్రశ్నల్లో సూక్ష్మం:- కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445


  తల్పగిరి రాజు సింహసేనడు జనరంజకంగా పరి పాలన సాగిస్తున్నాడు.ఆయనకు ఒక్కతే కూతురు మందాకిని.ఆమె విద్యలలో దిట్ట.మంచి తెలివి గలది.ఒక్కొక్క సారి రాజ కార్యాలలో  సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు చూపి రాజ సభలో అందరి మన్నలను పొందేది.

       ఇలా ఉండగా మందాకిని యుక్తవయస్కురాలైంది.తగిన వరుణ్ణి చూసి మందాకినికి వివాహం చెయ్యాలని సింహసేనుడు నిశ్చయించాడు.ఈ విషయం మందాకనికి సింహసేనుడు చెప్పాడు.

         "నాన్నా, వివాహం చేసుకుంటాను కానీ, నేను తల్పగిరి విడిచిపోను,దీనిని మీరు అర్థం చేసుకోండి"అని చిరు నవ్వుతో చెప్పింది.

      "నాన్నా,నేను స్వయం వరంలో పాల్గొన్న వరులను కొన్ని ప్రశ్నలు అడుగుతాను,నాకు సంతృప్తిగా సమాధానాలు చెప్పిన వారినే పెళ్ళాడుతాను"అని చెప్పింది.

      "నీ ఇష్ట ప్రకారమే చేద్దాం,ముందర నేను స్వయం వరంలో పాల్గొన బోయే వరులకు కత్తి యుద్ధం,భారత,భాగవత,మొదలైన పురాణాల్లో గల విజ్ఞానం గురించి పరీక్షలు పెడతాను,నాకు నచ్చిన వారిని నీవు నీ ప్రశ్నలు అడిగే ఏర్పాటు చేస్తాను"అని చెప్పాడు.

       "మంచి ఆలోచన నాన్నా, అలాగే కానివ్వండి"అని తన సంసిద్ధత తెలియచేసింది మందాకిని.

       సింహసేనుడి స్వయంవర చాటింపు విని అనేక మంది రాజ కుమారులు,ధనవంతుల కుమారులు వచ్చారు.

      రాజుగారు పెట్టిన పరీక్షలలో నెగ్గిన ముగ్గురు రాజ కుమారులు మందాకిని ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఎంపిక అయ్యారు.

       "నేను ఎప్పటికీ తల్పగిరిలోనే ఉండి పోవాలి,నా వయస్సు ఎప్పటికీ తరగి పోకూడదు...ఈ ప్రశ్నలకు జవాబులు మీ దగ్గర ఉన్నాయా?" అని అడిగింది

     ఈ ప్రశ్నలలోని సూక్ష్మాలను ఇద్దరు రాజ కుమారులు గ్రహించ లేక పోయారు.అవి పిచ్చి ప్రశ్నలుగా భావించి వారు వెళ్ళి పోయారు.

       మూడో రాజ కుమారుడు ప్రసన్న కొంత సేపు ఆలోచించి మందాకిని ప్రశ్నలకు జవాబులు ఈ విధంగా చెప్పాడు.

       "మీరు ఎప్పటికీతల్పగిరిలో ఉండాలంటే ప్రజలకు శాశ్వతంగా మేలు చేసే పనులు చేయాలి,తద్వారా మీ మంచి పనులు సదా తలచు కుంటూ మీరు ఇక్కడే ఉన్నట్టు భావిస్తారు!మీరు చేసిన మంచి పనుల వలన ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తారు.మీరు చేసిన మంచి పనులను గురించి తరతరాలుగా చర్చించుకుంటారు.అంతేకానీ మీ వయస్సును గురించి చర్చించరు.ఈ విధంగా వారి దృష్టిలో మీ వయస్సు పెరగదు!"అని చిరునవ్వుతో చెప్పాడు ప్రసన్న.

       అతని సమాధానాలు మందాకినికి ఎంతో తృప్తి నిచ్చాయి.సింహసేనుడు కూడా ప్రసన్న తెలివికి,సూక్ష్మాన్ని గ్రహించే శక్తిని మెచ్చుకుని ఒక శుభ ముహూర్తాన మందాకిని,ప్రసన్నలకు ఘనంగా వివాహం జరిపించాడు.

             


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం