పొట్టాపతి:-సముద్రాల శ్రీదేవి 9949837743

 రెక్కాడితే కానీ డొక్కాడదు
కాలు కదపనిదే కడుపు నిండదు
రాత్రి కప్పుకున్న దుప్పటి
ఎన్ని చిరుగులు వున్నా,
పొద్దు జాడ కమ్ముకోగానే
పొట్టాపతి కోసం పడే పాట్లు 
 లెక్కచేయవు ఇన్ని అగచాట్లు
పొగ వూదిన గొట్టం నుండి 
ఎగిసిన పోయిలోని మంటలు
ఆరని ఆకలి జ్వాలలుగా 
కణం కణం రవ్వల్లా రువ్వుతున్న 
జీవనం.
నేల  కంచములో వడ్డించుకు తిన్న బాధల మెతుకులు
జోలె లోని చిరుగుల కన్నాలే
కన్నుల కాలువ  దాటని 
నీరై  మది మత్తడి కింద
రహస్యంగా  దాచుకుంది.
భారంగా వాలిన రెప్పల అలికిడి
భుజాల బరువును  కొలిచిందేమో
మోయలేని  భవ సాగరపు 
బిందువుని కనుదోయి చివర్ల
భారాన్ని దించాలని ప్రయత్నిస్తుంది.
చిరునవ్వుల పెదవి  పదవి పీఠంపై మహారాజులా 
ఓటమి నెఱుఁగని 
ఆత్మ స్టైర్యమై
కూర్చుంది
నర్మ గర్భస్థ దేహం
 ఆక్టోపస్ లా  శరీర అంగాలన్నింటితో  శ్రమించినా   ఫలితం అందని జీవన వైరుధ్యం
 ఫలం నోటికి దొరకని దురదృష్ట
సాఫల్యం
నాలుగు వెళ్లే కదా నోటి ముద్ద పెట్టేది,
నాలుగు కాలాలు చల్లంగ చూస్తే 
నాలుగు రోజులు గడచిపోదా
అన్న ధీమానే , పొద్దున్నే 
పొద్దును మూటగా గట్టుకొని
 వెళుతుంది  బతుకు పయనం


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం