అమృత మూర్తి కి,కుసుమాంజలి ...!!*:- --డా.కె .ఎల్ .వి.ప్రసాద్ , హనంకొండ.
అమ్మ లు 
అనేక రకాలు 
అయినా ...
అమ్మ ..అమ్మే !
అమ్మ స్థానానికి 
మరో __
ప్రత్యమ్నాయం లేదు ,
అందుకే ...
అమ్మపాత్ర 
అనిర్వచనీయం !

కొందరు అమ్మలు 
కొడుకులను ,
అదికంగా _
ప్రేమిస్తారు ,
కొందరు అమ్మలు 
కూతుళ్లను ,
ఊహించనంతగా ,
ప్రేమిస్తారు ,
ఎక్కువశాతం తల్లులు 
కొడుకులను _కూతుళ్లను 
సమాన నిష్పత్తిలో ,
ప్రేమగా పెంచుతారు !

మా ..అమ్మ ,
మూడోరకం తల్లిగా ,
అందరినీ _
సమానంగా పెంచింది ,
తల్లిగా __
ప్రేమను పంచింది 
సంతానం 
పురోభివృద్ధికి ,
క్రొవ్వొత్తిలా _
కరిగిపోయింది !

అక్షరాస్యత 
లేకుంటేనేమి ....
అపారమైన తెలివితో 
ఒక సాదారణ కుటుంబాన్ని ,
సంపన్నుల కుటుంబంగా 
తీర్చిదిద్దింది ....!

అమ్మకు ...
అత్యాశలు లేవు ,
ఆమె కోర్కెలన్నీ 
పిల్లల అభివృధ్దిమీదే ,
అది కొసవూపిరివరకూ 
సాగిపోయింది ..
అనుకున్నది _
సాధించింది ,
విజయఢంకా 
మ్రోగించింది .....!

అదృష్టం ...
అందరికి కలిసిరాదు ,
అదిమా అమ్మ _
దరికి రాలేదు ....
సుఖాన్ని __
అనుభవించే సమయానికి ,
పిల్ల ల ....
అంచెలంచెల _
అభివృద్దిని చూడకుండానే ,
తానెవరికీ ....
భారంకాకూడదని ,
అనంతలోకాలకు 
హాయీగా _
ఎగిరిపోయింది ...
మమ్ములను _
దుఃఖ సాగరంలో 
ముంచేసింది ....!

అమ్మ త్యాగం 
మరువరానిది !
అమ్మజీవితం _
వెలకట్టలేనంత ,
త్యాగమయం  
అమ్మలున్న వారి జీవితం 
కొలమానం అక్కరలేని ,
ఆనంద సాగరం ...!!


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం