*శ్రమ విలువ-కథ*:-:--దుగ్గి గాయత్రి:-టి.జి.టి.తెలుగు,కల్వకుర్తి,-నాగర్ కర్నూల్,తెలంగాణ.


 గోపాలపురంలో నందన్,దేవి దంపతులు ఉండేవారు.వారు సంపన్నులే కాక సమాజ సేవలో కూడా ముందుండేవారు.వారి ఒక్కగానొక్క కొడుకు వర్ధన్.ఎంతో గారాబంగా పెరిగాడు.బాగా అల్లరి పిల్లవాడు.డబ్బుల విలువ,వస్తువుల విలువ,శ్రమ విలువ తెలవకుండా పెరిగాడు.ఎంత విలువైన బట్టలైన, వస్తువులైనా కొన్ని సార్లే వాడి పారేసేవాడు.వర్ధన్ ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు.అతనికి అన్నిటి విలువ తెలియచేయాలని,మనం తినే అన్నం నుంచీ కట్టుకునే దుస్తులు,ఇంకా వాడుకునే ప్రతీ వస్తువు తయారు వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉందని తెలపటానికి ఎంతో ప్రయత్నించేవారు.కానీ ఫలితం లేక పోయింది.అనుకోకుండా ఒకరోజు వర్ధన్ మామయ్య వర్ధన్ వాళ్ళింటికి వస్తాడు.పిల్లాడి ప్రవర్తనకు తల్లడిల్లుతున్న అక్కాబావల పరిస్థితి చూసి తన వెంట వర్ధన్ ని ఊరికి పంపమంటాడు.సరే అని నందన్, దేవి లు వర్ధన్ ని ఊరికి పంపిస్తారు.వర్ధన్  వాళ్ళ మామయ్య తమ ఊరిలోని శ్రామికులు మరియు కులవృత్తులు చేసుకొనే వాళ్ళ స్నేహితుల ఇళ్లకు తీసుకొనిపోతూ వాళ్ళేవిధంగా వస్తువుల తయారీలో కష్ట పడుతున్నారో ,ప్రత్యక్షంగా వారి కష్ట సుఖాలను,వారి యొక్క శ్రమను సమాజానికి ఏ విధంగా ధారపోస్తున్నారో తెలియపరచటం తో వర్ధన్ తాను ఇన్నాళ్లు ప్రవర్తించిన తీరుకు ఎంతో బాధ పడతాడు.శ్రమ,ప్రేమ,డబ్బు విలువను తెలుసుకొని తండ్రిని మించిన తనయుడిగా పేరొందుతాడు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం