ఆముక్తమాల్యద: -- యామిజాల జగదీశ్

 మా నాన్నగారి గురించి ఓ పుస్తకం సిద్ధం చేయాలనిపించిన రోజుల్లో ఆయన రాసిన వ్యాసాలకోసం అన్వేషించడం మొదలుపెట్టాను. అప్పుడు కొన్ని వ్యాసాలు నా కంట కనిపించాయి. వాటిలో నాకిష్టమైనది ఆముక్తమాల్యద. ఆంధ్రప్రభలో 1960లలో  వచ్చిన వ్యాసమిది. అసలు ఆముక్తమాల్యద కథ ఓ గొప్పకావ్యం. రసవత్తరం. 
ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. యుక్త వయస్సు వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని అనుకుంటుంది. విష్ణుచిత్తుల వారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది. ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖిస్తాడు. స్వామివారికి మాలాధారణ చేయరు. దానితో స్వామి మొహం చిన్నబోతుంది. దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని ఎంతగానో బాధపడతాడు. అప్పుడు స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా  ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు. తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది.
అటువంటి కావ్యాన్ని ఆధారం చేసుకుని నాన్నగారు రాసిన వ్యాసం ఇక్కడ  పూర్తిగా ఇవ్వడం లేదు. ఇది చదువుతున్నప్పుడు మా నాన్నగారు నాకు తెగ నచ్చేశారు. ఇలాటివీ రాస్తారా అని అనుకున్నాను. 
నాన్నగారి వ్యాసంలోంచి కొన్ని మాటలు....
".....దండ అంతా చేమంతులతోనే అల్లడం ఏమిటో? నాకు నచ్చలేదు. ఒక్కొక్క తులసీదళంకూడా చేర్చి కూర్చినట్టయితేనే ఈ దండ నిండుగా కనిపిస్తుంది. నాయనకి తెలియదని ఎలా అనుకుంటాను? మహాప్రభువుకి ఏది ఇష్టమో నాయనకి తెలుసు. అసలు ఈ తోటలో వేసిన పూలమొక్కలన్నీ ఎంచి ఎంచి నాటినవే. ఈ మొక్కలన్నీ ప్రభువుకి మాలగా రూపొందడానికి నిత్యమూ పూస్తూ ఉంటాయి.....
నాయన అల్లిన దండ ఎంత ముచ్చటగా ఉంటుందో చూడటానికి. ఏ పువ్వు కూర్చాలో నాన్నకి బాగా తెలిసినట్లు నాకు తెలియదు. 
ఇది నాన్న కూర్చిన దండ.
ఒక్కసారి వేసుకుని నిలువుటద్దంలో చూసుకుంటాను. ఆ, వేసుకోవచ్చా! తప్పు కదూ! ప్రభువుకి తెలిసిపోదూ! నేను వేసుకున్నానని! ఎందుకు తెలియదు. అంతర్యామియై ఉండే మహాప్రభువుకి తెలియకుండా ఉంటుందా! అది అపచారమవుతుంది. నేను ముందుగా వేసుకున్న పూదండ స్వామికి వెయ్యడం రెండు విధాల అపచారం. నాన్న అలాగే తీసుకు వెళ్ళి నా స్వామికి సమర్పిస్తాడు. ముందు నాన్నని మోసగించినట్టు అవుతుంది. నేను వేసుకున్నది స్వామికి సమర్పించడం రెండో తప్పు.
శ్రీరంగనాథునికి హారములయ్యే మందారం యశోద అయి ఉంటుంది. ఆనాడు తనివితీరా పాలిచ్చి పెంచిన ప్రేమ మరి. ఎడబాయలేక విశ్వమోహనునికొక పూజాపుష్పమైంది. ఇది ఈ పూదండలో మేరువు. ఔను. ఆనాడు పెంచిన తల్లి. ఈ జన్మలో ప్రధాన స్థానం ఆక్రమించుకోవడం సహజం.
నిజంగా నాడు గోపికలు ధన్యురాండ్రు! వాళ్ళు చేసిన వ్రతం చాలా గొప్పదని నాయన చెప్పగా విన్నాను. ఆ వ్రతం చేస్తే శ్రీరంగనాథుడు నన్ను తప్పక అనుగ్రహిస్తాడు. అయితే వ్రతాలు చెయ్యాలా? చెయ్యాలంటే చెయ్యాలి. ఆ...సత్యభామ ఏదో వ్రతం చేసిందట. ఏమిటది....ఆ....ఆ....జ్ఞాపకం వచ్చింది. పుణ్యకవ్రతం. కాని ఆ వ్రతం ....పతిని చేసిందట. పతిని దానమివ్వాలి. నాకు పతి ఎక్కడ? అదేమిటీ? పతి దానమిచ్చి బ్రతికి ఉండేదెట్లా? అదేమి వ్రతమో? నాకుపతి ఎక్కడ? పతి లేకపోవడమేమిటీ? నా వెర్రిగాని. రంగనాథుడే నా పతి. అమ్మయ్యో! నా పతిని నా గతిని నేను దానమిస్తానా? ఎంత అపచారం. నేను దానమివ్వలేను. నేనసలు నా పతినెవరికీ ఏ అవస్థలోనూ దానమివ్వను. ఇచ్చాననుకుందాం. నా పతిని నా మనోనాథుణ్ణి శ్రీరంగనాథుణ్ణి దానం పట్టే యోగ్యత ఎవరికున్నది? ఎంత ధైర్యం....ఎవరూ నా పతిని దానం పట్టలేరు.  అసలు నేనివ్వను. అయినా నన్ను ముందు ఆయన అనుగ్రహించవద్దూ? ఎందుకనుగ్రహించడూ? నాకేం లోపం? అందానికి తక్కువా? నేనే గోపికకు తీసిపోయాను? ముత్తెంలా ఉన్నాను. నేను తగనని ఆయన వంక వారెవరైనా వచ్చి చూసి చెప్పగలరా?....
ఇలా సాగిందీ వ్యాసం. నేనిక్కడ ఇచ్చింది చాలా తక్కువే. 
నిజం చెప్పాలంటే నేను మా నాన్నగారి వ్యాస రచన చదవటమన్నది ఇప్పుడే. ఆయన ఉన్న రోజుల్లో ఎప్పుడూ కన్నెత్తయినా వాటి వంక చూడలేదు. ఎంతసేపూ తమిళ కవితలూ తమిళ వ్యాసాలూ చదివేవాడిని. బాగున్నాయనుకుంటే తెలుగులోకి అనువదించే వాడిని. అలాంటి నేను ఇప్పటికైనా మా నాన్నగారి వ్యాసాలు కొన్నయినా చదివినందుకు ఆనందంగా ఉంది.

కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం