పురాణాలు రామాయణం భారతాలలో చదివాము త్యాగం గురించి. మనకి ఉన్న దాంట్లో పంచి పెట్టడం పంచుకుని తినటంవేరు.ఇది రక్త సంబంధం ఉన్న కుటుంబం ఆత్మీయులైన మిత్రుల మధ్య జరుగుతుంది. శిబి దధీచి జటాయువుల కధ మనందరికీ తెలుసు. కానీ దేశభక్తి రాజభక్తితో తమ జీవితాన్ని బలిచేసిన చరిత్రలో మిగిలారు.అందలో రాజపుత్ర దాసి పన్నాదాయి త్యాగం అపూర్వం. రాకుమారుడి ప్రాణరక్షణకై తన కొడుకునే బలి ఇచ్చిన ఆవీరమాత చిరస్మరణీయురాలు.తన కళ్ళెదుట తన చిన్నారి పాపడిని కత్తితో నరికితే భరించిన ఆకన్నతల్లిని తలుచుకుంటే ఏడ్పువస్తుంది.హిందీ సాహిత్యంలో ఆమెని అపూర్వ
దేవతగా చూపారు.మేవాడ్ రాజుని బనవీర్ అనే దుర్మార్గుడు చంపి ఆయన చిన్నారి కొడుకు ఉదయసింహుని చంపాలని పన్నా దాది ఇంటికి బైలుదేరాడు. పన్నాకి ఈవిషయం ముందే తెలుస్తుంది. సరిగ్గా అదే వయసు ఉన్న తన చిన్నారి కొడుకు చందన్ కి రాకుమారుడి దుస్తులు వేసి ఊయలలో నిద్రపుచ్చింది.ఉదయసింహుని కి తన కొడుకు దుస్తులు వేసి రోజూ కోటలోకి విస్తరాకులు పళ్లు పూలు తెచ్చే దాసి బుట్టలో పడుకోబెట్టి కోటని దాటించింది.ఆదాసి ఉదయుని సురక్షితప్రాంతంకి చేర్చింది. దుర్మార్గుడైన బనవీర్ పన్నా ఇంటి కి వెళ్ళి ఊయలలో ఉన్న చందన్ ని కత్తితో నరకాలని వస్తే ఆమాతృమూర్తి బతిమాలుతుంది"పసివాడైన రాకుమారుడిని చంపకు"అని వేడుకున్నా దుర్మార్గుడు చందన్ ని నరికి గర్వంగా వెళ్లి పోతాడు. తన కొడుకు ని బలిఇచ్చి ఉదయసింహుని మేవాడ్ రాణాగా నిలబెట్టిన పన్నా దాయి త్యాగం అపూర్వం.
ఇకమహా మంత్రి తిమ్మరుసు త్యాగం అపూర్వం. శ్రీకృష్ణ దేవరాయలు ఎంత కీర్తిప్రతిష్ఠలు సంపాదించినా తనను కాపాడిన తిమ్మరుసు నే అనుమానించాడు.ఘోరమైన నేరంతో కృశించాడు. ఒక బీద బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన ఆయన చరిత్ర మరుగున పడింది. ఆయన సోదరుడు గోవిందుడు.బాల్యంలోనే అమ్మా నాన్నలు చనిపోటంతో అనాధలుగా పెరిగారు.తిమ్మరుసు మహా చురుకైన వాడు. బంధువుఐన చిట్టి గగ్గన్న చంద్రగిరి రాజు దగ్గర మంత్రిగా ఉంటూ తిమ్మరుసుని తీర్చి దిద్దాడు.బాలుడైన తిమ్మన ఒక రోజు చెట్టు కింద నిద్రపోతుంటే ఒక పాము పడగవిప్పి నీడ నివ్వటం ఒక సాధువు చూశాడు. "నాయనా!నీవు భవిష్యత్తులో ఒక మహా సామ్రాజ్యానికి సూత్రధారివి బీజంగా భాసిస్తావు"అని ఆశీర్వదించాడు.తెలుగు కన్నడ సంస్కృత పార్శీభాషలలో పండితుడైన తిమ్మరుసుని గూర్చి తెలీక పోటం మన దురదృష్టం. విజయనగర సామ్రాజ్యంకి మహామంత్రి గా ఎన్నో పరీక్షలు నెగ్గిన మహామేధావి ఆయన.నరసింహరాయలు శ్రీ కృష్ణ దేవరాయలను చంపమని తిమ్మరుసు ని ఆజ్ఞాపించాడు. ఆయన కృష్ణరాయల ని కాపాడి మేకకళ్లను ఆనవాలుగా చూపాడు.కానీ చెప్పుడుమాటల ప్రభావంతో తన కొడుకు కి తిమ్మ రుసు విషం ఇచ్చి చంపాడు అని కృష్ణ రాయలు తిమ్మ రుసుకనుగుడ్లు పీకించటం అమానుషం! తన తప్పు తెలుసు కున్న రాయలు ఎంత ఏడ్చినా ఏంలాభం?రాయలను క్షమించి తిమ్మరుసు ప్రాణం వదిలాడు. అది తలుచుకుంటే మన గుండె చెరువు అవదూ?భువనవిజయం అనే కళాభవనాన్ని నిర్మించినవాడు మహామంత్రి తిమ్మరుసు అని మనకి తెలీదు. ఆయన త్యాగం అనుపమానం.ఇలాంటి త్యాగధనులు నేటికీ ఉన్నారు. వారి సంతానం చెప్పుకోదు.వజ్రోత్సవ వేళ మన స్వాతంత్ర్య యోధులను తలచుకోవాలి.
దేవతగా చూపారు.మేవాడ్ రాజుని బనవీర్ అనే దుర్మార్గుడు చంపి ఆయన చిన్నారి కొడుకు ఉదయసింహుని చంపాలని పన్నా దాది ఇంటికి బైలుదేరాడు. పన్నాకి ఈవిషయం ముందే తెలుస్తుంది. సరిగ్గా అదే వయసు ఉన్న తన చిన్నారి కొడుకు చందన్ కి రాకుమారుడి దుస్తులు వేసి ఊయలలో నిద్రపుచ్చింది.ఉదయసింహుని కి తన కొడుకు దుస్తులు వేసి రోజూ కోటలోకి విస్తరాకులు పళ్లు పూలు తెచ్చే దాసి బుట్టలో పడుకోబెట్టి కోటని దాటించింది.ఆదాసి ఉదయుని సురక్షితప్రాంతంకి చేర్చింది. దుర్మార్గుడైన బనవీర్ పన్నా ఇంటి కి వెళ్ళి ఊయలలో ఉన్న చందన్ ని కత్తితో నరకాలని వస్తే ఆమాతృమూర్తి బతిమాలుతుంది"పసివాడైన రాకుమారుడిని చంపకు"అని వేడుకున్నా దుర్మార్గుడు చందన్ ని నరికి గర్వంగా వెళ్లి పోతాడు. తన కొడుకు ని బలిఇచ్చి ఉదయసింహుని మేవాడ్ రాణాగా నిలబెట్టిన పన్నా దాయి త్యాగం అపూర్వం.
ఇకమహా మంత్రి తిమ్మరుసు త్యాగం అపూర్వం. శ్రీకృష్ణ దేవరాయలు ఎంత కీర్తిప్రతిష్ఠలు సంపాదించినా తనను కాపాడిన తిమ్మరుసు నే అనుమానించాడు.ఘోరమైన నేరంతో కృశించాడు. ఒక బీద బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన ఆయన చరిత్ర మరుగున పడింది. ఆయన సోదరుడు గోవిందుడు.బాల్యంలోనే అమ్మా నాన్నలు చనిపోటంతో అనాధలుగా పెరిగారు.తిమ్మరుసు మహా చురుకైన వాడు. బంధువుఐన చిట్టి గగ్గన్న చంద్రగిరి రాజు దగ్గర మంత్రిగా ఉంటూ తిమ్మరుసుని తీర్చి దిద్దాడు.బాలుడైన తిమ్మన ఒక రోజు చెట్టు కింద నిద్రపోతుంటే ఒక పాము పడగవిప్పి నీడ నివ్వటం ఒక సాధువు చూశాడు. "నాయనా!నీవు భవిష్యత్తులో ఒక మహా సామ్రాజ్యానికి సూత్రధారివి బీజంగా భాసిస్తావు"అని ఆశీర్వదించాడు.తెలుగు కన్నడ సంస్కృత పార్శీభాషలలో పండితుడైన తిమ్మరుసుని గూర్చి తెలీక పోటం మన దురదృష్టం. విజయనగర సామ్రాజ్యంకి మహామంత్రి గా ఎన్నో పరీక్షలు నెగ్గిన మహామేధావి ఆయన.నరసింహరాయలు శ్రీ కృష్ణ దేవరాయలను చంపమని తిమ్మరుసు ని ఆజ్ఞాపించాడు. ఆయన కృష్ణరాయల ని కాపాడి మేకకళ్లను ఆనవాలుగా చూపాడు.కానీ చెప్పుడుమాటల ప్రభావంతో తన కొడుకు కి తిమ్మ రుసు విషం ఇచ్చి చంపాడు అని కృష్ణ రాయలు తిమ్మ రుసుకనుగుడ్లు పీకించటం అమానుషం! తన తప్పు తెలుసు కున్న రాయలు ఎంత ఏడ్చినా ఏంలాభం?రాయలను క్షమించి తిమ్మరుసు ప్రాణం వదిలాడు. అది తలుచుకుంటే మన గుండె చెరువు అవదూ?భువనవిజయం అనే కళాభవనాన్ని నిర్మించినవాడు మహామంత్రి తిమ్మరుసు అని మనకి తెలీదు. ఆయన త్యాగం అనుపమానం.ఇలాంటి త్యాగధనులు నేటికీ ఉన్నారు. వారి సంతానం చెప్పుకోదు.వజ్రోత్సవ వేళ మన స్వాతంత్ర్య యోధులను తలచుకోవాలి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి