*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 018*
 *చంపకమాల:*
*అజునకు దండ్రివయ్యు సన | కాదులకుం బరతత్వమయ్యు స*
*ద్ద్విజమునికోటికెల్ల బర | దేవత వయ్యు దినేశవంశ భూ*
*భుజులకు మేటివయ్యుఁబరి | పూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా*
*డ్ధ్వజ మిముఁబ్రస్తుతించెదను | దాశరధీ కరుణాపయోనిధీ.* 
*తా:*
దయ కరుణ అనే గుణాల రూపమైన దశరధ రామా! నీవు బ్రహ్మ కు తండ్రివి. బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందలాదులకు పరతత్వముగా కనిపించావు. మంచి బ్రాహ్మణులు, మునులకు నీవే దేవతవు. సూర్యవంశ రాజులలో గొప్పవాడిగా కీర్తింపబడి, పక్షి రాజైన గరుత్మంతుని నీ రధానికి జెండాగా వుంచుకున్న నిన్ను నేను ఎల్ల కాలం కీర్తిస్తూ, భజన చేస్తూ వుంటాను....... అని భద్రాచల రామదాసు గా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*పరాత్పర పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడైన శివుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేరు కాదు. వేరు రూపాలలో వున్న ఒకే పరతత్వము. ఆ పరతత్వమును తెలుసుకుని, పట్టుకుని వుండగలిగిన వారు మోక్షప్రాప్తికి అర్హులు. ఆ పరతత్వమును మనకు పరిచయం చేయగలిగిన వారు సద్గరువు. అటువంటి సద్గరువు మనల్ని తన దగ్గరకు పిలిపించుకుని పుత్ర వాత్సల్యంతో చూపిన తత్వమార్గాన్ని అనునిత్యం సాధన చేయగలిగేలాగా అనుగ్రహించమని, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్థిస్తూ......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం