*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(౧౧౬ - 116)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*బ్రహ్మ మనస్సు నుండి ఒక స్త్రీ - ఒక పురుషుడు ప్రకటమగుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -*
*నారదా!  సతీదేవి, శివ భగవానుని కీర్తి ఎంతో మధురమైనది. పావనమైనది. ఎవరికీ తెలియనటువంటిది. భగవంతుడు అగు పరమశివుడు, నిర్గుణ, నిర్వికల్ప, నిరాకార, శక్తిరహిత, చిన్మయ, సత్, అసత్ లకంటే విలక్షణమైన రూపముతో వున్నవాడు. అతనే సగుణుడై, సర్వ శక్తిమంతుడై ఈ మూడు లోకములను ధరించి ఉన్నాడు. ఆతని వెంట భగవతి అయిన ఉమాదేవి కూడా వుంది. వారు ఇరువురు పరాత్పర స్వరూపముతో నిలిచి ఉన్నారు.*
*ఆ పరమశివుని నుండి పుట్టిన బ్రహ్మ నైన నేను సృష్టి కార్యమును, విష్ణువు ఆ సృష్టిని పెంచి పోషించు పనిని, రుద్రుడు సంహారకార్యమును చేస్తున్నాము. శివుడే, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే మూడు రూపాలలో వ్యక్తమై వున్నాడు. బ్రహ్మ నైన నేను శివుని ఆజ్ఞతో, సకల చరాచర సృష్టి చేసాను. నా నుండి మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగీరుడు, క్రతువుడు, వశిష్టుడు, నారదుడు, దక్షుడు, భృగువు మానస పుత్రులుగా పుట్టారు.*
*నా హృదయము నుండి ఒక స్త్రీ, ఎంతో రూపవతి ప్రకటమైంది. ఈమె సర్వాంగ సుందరి. ఈమె పేరు "సంధ్య". పగటి పూట క్షీణిస్తూ, సాయం కాలం వృద్ధి చెందుతుంది. చక్కని రూపవతి అయిన ఆమె, అందమైన కనుబొమలతో, ఎప్పుడూ ఏదో తెలియని మంత్రమును జపిస్తూ వుంటుంది. తరువాత అందమైన అంగములతో, సన్నని నడుము భాగముతో, కమలముల వంటి కన్నులతో, మదించిన ఏనుగు లాగా మంచి గంధపు వాసన వెదజల్లుతూ వున్న ఒక పురుషుడు నా మనసు నుండి పుట్టాడు. ఈ పురుషుడు పూలతో చేయబడిన అయిదు బాణములు పట్టి వున్నాడు. ఈతని సమ్మోహన శక్తికి దేవతలు, మునులు, రుషులు మానవులు అందరూ లొంగి పోవలసిన వారే. వీరందరి మనసులలో ప్రవేశించి, వారి సుఖములకు కారణమై సృష్టి యొక్క సనాతన కార్యము జరిపిస్తూ వుంటాడు. ఈ తడే సృష్టి కి కారణభూతుడు అవుతాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం