*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-( 119 )*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*సంధ్య తపస్సు - శివుని స్తుతి - మేధాతిథి యజ్ఞమునకు వెళ్ళుట*
*బ్రహ్మ, నారదుని ఇలా చెప్పాడు -* 
*నారదా! నాలుగు యుగాల పాటు జలపానము మాత్రమే చేసి మౌనముగా సంధ్య చేసిన తపస్సు కు మెచ్చిన పరమశివుడు దివ్య నేత్రాలు, జ్ఞనము ఇచ్చి సంధ్యా దేవి ఎదుట ప్రత్యక్షమై, ఆమె చెసిన స్తోత్రలకు సంతోషించి తన కోరికలను తెలియజేస్తే తీర్చుతాను అని అనుగ్రహం తెలియజేస్తాడు, నందివాహనుడు.*
*తన ఎదురుగా వుండి పార్వతీపతి పలికిన అమృతమైన మాటలను విని సంధ్య "జీవుడు పట్టగానే కామదేవుని అధీనము కాకుండా వుండాలి. నా భర్త నాయందు మిక్కిలి అనురాగము కలిగి వుండాలి. నా భర్త తప్ప వేరెవరైనా నావైపు కామ దృష్టి తో చూస్తే వారు ఆ క్షణమే నపుంసకులు అవ్వాలి" అని కోరుతుంది.*
*ఈ మాటలను విన్న అంబికాపతి, ప్రతీ ప్రాణి జీవితములో బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనే నాలుగు స్థితులు వుంటాయి. కౌమారము దాటి యవ్వనము లోకి అడుగిడుతే గానీ ఏ జీవిపై కూడా కామదేవుని ప్రభావము లేకుండా అనుగ్రహిస్తున్నాను. ఈ విధముగా సంధ్యా దేవీ! నీ తపస్సు ప్రభావముతో ఈ హద్దును నేను నియమిస్తున్నాను. నీవు ఈ సమస్త భూమండలములో దివ్య సతీగా వెలుగొందుతావు. ఈ స్థానము వేరెవరికీ సాధ్యము కానిది. నిన్ను వివాహమాడిన పురుషుడు తప్ప వేరెవరూ నిన్ను ఆదరముతో చూడలేరు. అలా చూచిన వెంటనే, అతడు నపుంసకుడు అవుతాడు. ఇందులో సందేహము లేదు. మహానుభావుడైన ఒక మహర్షి నీకు భర్త అవుతాడు. నీ భర్త నీతో ఏడు కల్పముల వరకు సహజీవనం చేస్తాడు.*
*నీవు పూర్వ కాలములో, అగ్నిలో నా శరీరం త్యజిస్తాను అని శపథం చేసావు. అది నెరవేరే మార్గం ఇప్పుడు నేను చెపుతాను. ఈ చంద్రభాగ నదీతీరంలో గొప్ప మునివరుడైన మేధాతిథి మహర్షి జ్యోతిష్టోమము అనే మహా యజ్ఞము చేస్తున్నాడు. పన్నెండు సంవత్సరాలు జరిగే ఆ యజ్ఞం లో అగ్ని ఎల్లప్పుడూ తీక్షణమైన జ్వాలలతో వెలుగుతూ వుంటుంది. అందులో నీవు ఎవరిని భర్తగా పొంద దలచుకున్నావో ఆ మహర్షిని తలచుకుంటూ, నీ శరీరమును ఆ అగ్నిలో చాలించు.  ఇలా ఆదేశించి పరమశివుడు అంతర్ధానం అయ్యాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం