శక్తిగా మారిన వ్యక్తి;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆయన...
తన పుట్టిన రోజుని సెలవుగా ప్రకటించమని చెప్పలేదు...
విచ్చల విడిగా వీధివీధికి
విగ్రహాలను స్థాపించమని చెప్పలేదు...
తన రాతిరాళ్ళకు రంగురంగులా పూలహారాలు అలంకరించమని చెప్పలేదు...
ప్రతి ప్రభుత్వ కార్యలయాలలో తన చిత్ర పటాలు ఉంచమని చెప్పలేదు...
తళుకుల నోట్ల పైన తన మొగమును ముద్రించమని చెప్పలేదు...
కంఠస్వరాలు పగిలేలా, దిక్కులు పెక్కటిల్లెలా, జైహింద్ లు, 
జిందాబాద్ లు, జోహార్లు కొట్టమని చెప్పలేదు...
ఆయన ఎప్పుడూ చెప్పలేదు...
కానీ ఇవ్వన్నీ చేసేస్తున్నాం, పైగా గౌరవం అంటూ పెద్ద పెద్ద కితాబులను ఇచ్చేస్తున్నాం...
నిజానికి,
గాంధీజీ నమ్మిన సిద్దాంతాలతో నడిచిన వ్యక్తి...
యావత్ జగతిని ముందుకు నడిపిన శక్తి...
ఆయన చెప్పలేదు...
జాతిని నీతిని మరువమని
మనలో మనని, శత్రుత్వాన్ని పెంచుకోమని
మనిషిని మనిషి చంపుకోమని
మొత్తంగా మానవత్వానే మరచిపొమ్మని
అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలను మౌనంగా భరించమని...
యువతను బాధ్యత మరిచి బరితెగించమని
మగ అహంకారంతో మానభంగాలు చేయమని... 
మగువలను చిత్రహింసలు పెట్టమని...
సత్యాన్ని, అహింసను ఆయుధాలుగా మలచుకొని 
అసాధ్యమైన పోరాటాలకు పూనుకున్నాడు...
స్వేచ్చా భారతాన్ని కాంక్షించాడు
దేశాభివృద్ధికై  కలలు కన్నాడు
కానీ మనం మాత్రం కన్నీటితో తడిచిన,
రక్తానితో మరిగిన, మహానుభావుల వ్యధలకు,దేశభక్తుల 
త్యాగాల కథలకు ఫలితంగా అందిన స్వతంత్ర భారతదేశంలో
విలువలను మరచిపోతూ, వ్యసనాలకు బందీ అయిపోతూ 
మన స్వతంత్ర దేశంలో మనమే స్వతంత్రాన్ని కోల్పోయి ఇంకా 
బానిసలుగానే బ్రతుకుతున్నాము...
బ్రతికేస్తున్నాము...


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం