అన్నమయ్య - పాదార్చన; -" కావ్యసుధ "" సాహిత్య శిరోమణి " హయాత్ నగర్9247313488
 సంసారం ఒక వృక్షమైతే, అందులో సత్ సాహిత్యం, సత్ సాంగత్యం అనేవి రెండు అమృత ఫలాలంటారు జ్ఞానులు, అనుభవజ్ఞులు. పదకవుల సంకీర్తనా వృక్షం నిండుగా అమృతఫలాలే ఉన్నాయి. ఆ సుమధుర ఫలాలను ఆరగించడానికి అలవాటు పడిన మనసుకు మరెందులోనూ తృప్తి, ఉపశమనం లభించదు. అంతటి శక్తిమంతమైనవి సంకీర్తనలు. వాటి నిశ్చలమైన మనస్సుతో వింటే, యుగయుగాలనాటి ఆ శ్రీహరి లీలల్ని ప్రత్యక్షంగా చూస్తున్న దివ్యానుభూతి కలుగుతుంది. చుట్టూ అలముకొన్న భయంకరమైన సమస్యల చీకట్లన్నీ పటాపంచలై జ్ఞానజ్యోతితో గమ్యాన్ని దర్శిస్తున్న స్ఫూర్తి కలుగుతుంటుంది.పదకవితా పితామహుడైన అన్నమయ్య అందించిన గానామృత ఝరి కలియుగ ప్రత్యక్షదైవాన్నే కదిలించింది. కరిగించింది. మృదుమధురమైన పదజాలంతో మాటల్నే పాటలుగా మలచి, తనదైన వాణిలో, బాణిలో ఏడుకొండలవాడిని మెప్పించిన గడసరి అన్నమయ్య ఒక చోట పరబ్రహ్మ, ఒకనోట కోనేటిరాయడు, -మరోచోట చిన్నికృష్ణుడు ఇలా వేవేల రూపాలలో ఆ స్వామిని దర్శించి దర్శింపజేసి తరింపచేసిన పదకవితా సమ్రాట్ అన్నమయ్య.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం