హాస్యగాడికి కిరీటం;; (నిజంగా జరిగిన కథ);-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

   1416 లో సుకేత్ పంజాబ్ లో ఒక చిన్న రాజ్యం. అప్పటిలోసుకేత్ రాజు పరిపాలనా దక్షత లేని వాడని తొలగించి కొత్త రాజును ఎన్నుకునేందుకు ఆ రాజ్యపు ప్రజలు చరిత్రలో కనీ విని ఎరుగని  కొత్తరకం చాటింపు వేయించారు.
      భారతదేశంలో గల ప్రఖ్యాత నాటక కళాకారుల్ని తమ రాజ్యంలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా దేశంలోని అన్ని రాజ్యాలకు సందేశాలు పంపారు. ఆ ప్రదర్శన సుకేత్ అంతఃపురంలోని తోటలో ఏర్పాటు చేయబడింది.ఏ నటుడైతే ప్రేక్షకులను పూర్తిగా మెప్పిస్తాడో అతనే ఆదేశానికి రాజన్నమాట! 
       ఆ విధంగా ఆ ప్రదర్శనలో మైన్ మదన్ అనే హాస్య సంచార కళాకారుడు అటు ప్రేక్షకులచేత, పోటీలో పాల్గొన్న తోటి కళాకారుల చేత కొనియాడబడ్డాడు! 
      ప్రజలు అతనిని రాజుగా నిర్ణయించి, నేరుగా స్టేజీ మీదకు తీసుక వెళ్ళి రాజుగా ప్రకటించి తీసుకవెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు! 
      ఆ విధంగా మైన్ మదన్ పేరును మదన్ సైన్ గా మార్చుకుని నిరాటంకంగా 26ఏళ్ళు సమర్థవంతంగా పరిపాలించాడు.
      అతని వంశంవారు ఆ రాజ్యాన్ని సంపూర్ణ స్వాతంత్ర్యం సంపాదించే వరకు అంటే 1947 వరకు పరిపాలించారు.
     (ఆధారం Believe it or not 6th edition)
                    """"""""""""""""""""""

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం