ప్రబోధం (కవిత);-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
రండి రండి రండి మా మాటను వినుకోండి
మా భరతమాత ప్రియమైన మిత్రులారా
లెండి లెండి లెండి మీరు కూడా వినరండి
ఓ భారతీయ మా మంచి మిత్రులారా !

వ్యాపారం ముసుగేసుక ఆంగ్లేయులు
దోచుకునేటందుకు మన దేశం వచ్చిరి
అధికారం మాదని అహంకారంతో సెలవిచ్చిరి!

వారు మన భారతీయులను అష్ట కష్టాలు బెట్టిరి
కారాగారంలో పెట్టి హింసించ బట్టిరి
మన జాతిపిత మహాత్మా గాంధీజీ గమనించే
స్వాతంత్ర పోరాటం తాను వేగ జరిపించే !

స్వాతంత్రం సాధించి మనకు అందించుటకు
అహరహం సమరం సాగించను బాపూజీ
తట్టుకోలేక పలాయనమైన ఆంగ్ల ప్రభుతకు
మెట్టు దిగి వచ్చేలా కలిగించనుగా ఇబ్బందిజీ!

అహింసా ఆయుధాన్ని చేతబట్టి
ఆంగ్లేయులను తాను వెళ్ళగొట్టి
హింస లేని విల్లును తాసంధించే
స్వాతంత్రాన్ని మనకు అందించే !

సత్యమనే ఆయుధాన్ని పట్టమని చెప్పె
అసత్య దైత్య శక్తుల గుట్టుతాను విప్పె
ఉవ్వెత్తున తల ఎత్తుక నడవమన్నడు
దేశం కోసం ప్రాణమైన విడవమన్నడు!


సత్య దీక్ష వ్రతాన్ని తాను చేయించే
నిత్య గ్రహశోధన మార్గాన్ని చూపించే
మన ఆశయాల తీరం చేరాలని చెప్పె
సంశయాల పరంపర గుట్టుతాను విప్పె !

అహింస ఆయుధాన్ని తాను చేతబట్టె
మన దేశం నుండి ఆంగ్లేయులను వెళ్లగొట్టే
తత్ఫలితంగా సిద్దించేను స్వాతంత్రం
ఫలించెనుగా మహాత్ముని గణతంత్రం !

బాపూజీ బాటలోనే మనం నడవాలండి
దేశం కోసం మన ప్రాణమైన విడవాలండి
ఇది మనం పుట్టి పెరిగిన భారతదేశం
అందిద్దాం మనందరం ఓ శుభ సందేశం !


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం