ఉత్తమ విద్యార్థి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 విద్యార్థి అంటేనే విద్యను అర్ధించే వాడు అని అర్థం. నాకేమీ తెలియదు నాకు చెప్పండి అని అడిగితే వాడిని ఉపాధ్యాయుడు దగ్గరకు తీసుకుంటాడు. అది విద్యార్థి  మంచి  లక్షణం కనుక తన తోటి  విద్యార్థులలో ఎవరు బాగా చదువుతున్నారు  ఎవరికి బాగా మార్కులు వస్తున్నాయో వారిని దృష్టిలో పెట్టుకొని వారి కన్నా ఎక్కువగా చదవాలన్న తపన కలిగిన వాడు ఉత్తమ విద్యార్థి అవుతాడు. చదవడం అంటే  పాఠం వల్లి వేయడం కాదు,  పాఠం కానీ పద్యం కానీ కంఠస్తం చేస్తే అది తెలుస్తుంది  దానినే అప్పుడు చెబుతాడు  కానీ దానిని ఎరగడం ముఖ్య లక్షణం. ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని  శ్రద్ధగా విని, విషయం తెలిసి దానిని ధారణ చేసి, దానిని సాధన చేయడం వల్ల మాత్రమే  మంచి చదువరి అనిపించుకుంటాడు. ఆ ఎరుక లేకుండా చదివితే ఆ ఫలితం ఉండదు. చదువుతున్నంత సేపు తనకది తెలిసినట్లే ఉంటుంది  తరువాత దాని గురించి తెలియదు.
పోతనగారు ప్రహ్లాదునితో చెప్పించినట్లు  చదువులలోని మర్మమెల్ల తెలిసితి తండ్రి అని.  ఆ మర్మాన్ని తెలుసుకోకుండా పై పైన చదివితే దానికి ప్రయోజనం ఉండదు. చదివినంత సేపు సద్గుణి అనిపించుకుంటాడు. దానిని పోలుస్తూ వేమన చెరువులో కప్ప తామరాకు మీద కూర్చుంటుంది  అక్కడ ఎంత సేపు ఉంటుంది  క్షణకాలం  తర్వాత మామూలే  అలా కాకుండా చదివిన ప్రతి అక్షరాన్ని గుర్తుపెట్టుకొని క్షరం కాకుండా చూసుకునేవాడు  ఉత్తమ విద్యార్థిగా ఉత్తమ పౌరునిగా ఎదుగుతాడు అని వేమన చెబుతున్నాడు. 



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం