పూలమ్మిన చోట కట్టెలమ్మడం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.


 అప్పు ఇచ్చిన వాడి వెంట  చెప్పులు ఉన్న వాడి వెంట వెళ్ళ రాదు అని సామెత.  చెప్పులు వేసుకున్న వాడు ముళ్ళలో, రాళ్ళలో కూడా వెళితే...అప్పు ఇచ్చిన వాడి  వెంట వెళితే బంటు లాగానే ఉండాలి. జీవితంలో ఏ జీవి సాత్విక జీవితాన్ని గడపడం  మనం చూడం. చిన్న అధికారి నుంచి కోటీశ్వరుని వరకు ఈ కష్టాలు తప్పవు ఎవ్వరికీ. పాండవులు, హరిశ్చంద్రుడు నుంచి అనేకమంది రాజ్యాలను పరిపాలించిన వారు ఇలా  అనేక కష్టాలను ఎదుర్కున్న వారే. నలుడు తన అవతారాన్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ధనవంతుణ్ణి అన్ని సుఖాలను అనుభవిస్తున్నాను అని  ఎవరూ గుండె మీద చేయి వేసుకుని చెప్పలేరు. తన తెలివి వల్ల ధనాన్ని సంపాదించవచ్చు కానీ ప్రకృతి కలిగించే ఇక్కట్ల నుంచి అతను తప్పించుకోలేడు. పాండవులు జీవితాన్ని ఎంతసుఖంగా గడిపారు రక్త సంబంధీకుల కుసంస్కారం వల్ల అడవుల పాలు కావలసి వచ్చింది, అష్టకష్టాలు పడి  భీముడు అందరినీ రక్షించ గలిగాడు. అజ్ఞాతవాసానికి వచ్చేసరికి  వారి వేష భాషలను మార్చుకొని ఎవరికి వచ్చినది వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా విరటుని రాజు కొలువులో ప్రపంచాన్ని జయించగల సామర్ధ్యం కల అర్జునుడు  విరాటరాజు కుమార్తెకు నాట్యాన్ని నేర్పే నాట్యాచారుడిగా ఉండవలసి వచ్చింది  సమస్త భోగాలు అనుభవించిన ద్రౌపది విరట రాజు భార్యకు పూల మాలలు  తయారుచేసే చెలికత్తె (సైరంధ్రి) గా మారి విరటుని భార్య సుధేష్ణ చెప్పినట్లు  చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అది ప్రకృతి ప్రకోపించి నప్పుడు జరిగే విష పరిణామం దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. 


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం