ప్రతీ యేటా తుపాన్ భీభత్సాలతో
ప్రకృతి వైపరీత్యాలతో
కుండపోత వర్షాలతో
జనావాసమంతా జలమయమవుతుంది
తీరప్రాంత మంతా
జలప్రళయానికి తల్లడిల్లి పోతుంది
జనమంతా చేప పిల్లల్లా
వరదల్లో చిక్కి గిల గిలా కొట్టుకుంటూ
ప్రాణాలు విడుస్తున్నారు
తీరప్రాంతాలే కాదు ఇప్పుడూ
గల్లీ గల్లీ నీటితో నిండిపోయి
మ్యాన్హోల్లాన్నీ మృత్యు కుహరాలుగా మారి
పసి పిల్లలు మొదలు పండుటాకుల
వరకు మృత్యువాత పడుతున్నారు
జీవమంతా నిస్తేజమవుతుంది
ప్రకృతి సంపద నశించి పోతుంది
మానవులకు మనుగడ భయంకరంగా మారుతుంది
అధికారయంత్రాంగం ఎప్పటికప్పుడే
ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తూ
పునరుద్దరణ పనులు చేస్తున్నారు
మళ్ళీ పునరావృతమవుతుంది
ప్రభుత్వాలు ప్రతిపక్షాలు
సమిష్టిగా కలిసి "శాశ్వత జగత్ రక్షణా పథకం" కిందా
మేధావులు శాస్త్రవేత్తలు ఇంజనీర్లతో ఘోష్టి జరిపి
సరియైన ప్రాజెక్ట్ల నిర్మాణం చేబట్టి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి