''టాలీవుడ్ ఫిలిం ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న మునినాయక్"


 హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎల్వి ప్రసాద్ డిజిటల్ ఫిల్మ్ ల్యాబులో ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ రంజిత్ ఆధ్వర్యంలో టాలీవుడ్ ఫిలిం ఫేర్ ఫెస్టివల్స్  అవార్డులు ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మెన్ శ్రీ పి.రామకృష్ణ గౌడ్,ప్రముఖ నిర్మాత శ్రీ ఎం.ఎన్.చౌదరి, ప్రముఖ నిర్మాత & దర్శకుడు శ్రీ అలీఖాన్ , ప్రముఖ నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ శ్రీ ఆర్.మానీక్,ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీ నిక్సన్ మాస్టర్,ప్రముఖ నటుడు శ్రీ షెకింగ్ శేషు పలువురు సినీ ప్రముఖులు హాజరు అయి జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు టాలీవుడ్ తెలుగు ఫిలిం ఫేర్ అవార్డులు అందజేశారు. ఓ వైపు చదువుకుంటూ మరో వైపు సమాజానికి ఉపయోగపడే కవితలు రాస్తూ మొటివేషన్ స్పీకర్ గ ఎన్నో క్కార్యక్రమాలు చేపడుతూ వేలాది స్త్రీ, పురుషులను చదవాలన్న ఆసక్తి ఉన్న సరైన సదుపాయం లేని వారిని గుర్తించ్చి "మై ఫ్రెండ్స్ పోలీస్ అడ్డా" అనే వాట్స్ అప్ సమూహము ద్వారా దాదాపుగా 2500 స్టూడెంట్స్ కి ఆన్లైన్ ద్వారా ఉద్యోగం కోసం కావాల్సిన అన్ని అంశాలను పిడిఎఫ్ రూపంలో అందిస్తూ కేజీ టు పీజీ విద్యార్థులకు కావాల్సిన సమాచారం అందిస్తూ అభాగ్యులకు నేరుగా వెళ్లి సహాయం చేసి వారికీ అండగా నిలవడం అనాధ పిల్లలకు సహాయం చేయడం టాలెంట్ ఉన్న కొత్తవారిని పరిచయం చేస్తూ ఇండస్ట్రీకి కొత్త వ్యక్తులను పంపిస్తూ వారి జీవితాలకు వెలుగు ఇస్తూ ఇతరుల సంతోషాలను కోరుకుంటూ తన సేవతో ముందుకు దూసుకుపోతూ నేటి యువతకు ప్రముఖులకు సైతం ఆదర్శమైతున్న మునినాయక్ ని ''టాలీవుడ్ ఫిలిం ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు మునినాయక్ కు" ఇచ్చామని సంస్థ అధ్యక్షులు రంజిత్ తెలియజేసారు. 
తెలుగు టాలీవుడ్ ఫిలిం ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందజేసి ఘనంగా ప్రముఖుల చేతుల మీదుగా సన్మానించారు. వయసు చిన్నదే ప్రతిభ అద్బుతం అని ఎలాంటి స్వార్దం లేకుండా ఇప్పటి వరకు 2220 పై అవార్డులు అందుకున్న యువకుడు తెలంగాణ &  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ పాటశాలలో ఉచిత వ్యక్తిత్వ వికాస సదస్సులు నిర్వహించడమే కాకుండా  ప్రతి నెల ఒక ఆదివారం ఒక పూట ఫుట్ పాత్ పై ఆకలితో అలమటించే అభాగ్యులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అని అందుకే ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ టాలీవుడ్ ఫిలిమ్ ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు కి ఎంపిక చేసి అవార్డు అందజేశామని ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ నిర్మాత & దర్శకుడు,నటుడు శ్రీ డాక్టర్ రంజిత్ న్యూస్ టుడే కి తెలిపారు.యువ కవి,రచయిత,వ్యక్తిత్వ వికాస శిక్షకుడు,సమాజ సేవకుడు మునినాయక్ మాట్లాడుతూ ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ టాలీవుడ్ ఫిలిం ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తనను ఆదరించి అభిమానించి ప్రోత్సహించే ఆత్మీయులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మునినాయక్ కు ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ టాలీవుడ్ ఫిలిమ్ ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం పట్ల అభిమానులు,ఆత్మీయులు, స్నేహితులు,గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి పలువురు మునినాయక్ ని అభినందిచారు.ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి పలువురు సినీ ప్రముఖులు తో పాటు అవార్డు గ్రహీతలు హాజరు అయ్యారు..
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం