బలే పద్యం; -- యామిజాల జగదీశ్
 ఇంగ్లీషు మాటలను ప్రయోగిస్తూ ఓ ఆసక్తికరమైన పద్యాన్ని ఏరిన ముత్యాలు అనే పుస్తకంలో చదివాను. సాహిత్య సాగరంలో ఏరిన ముత్యాలు అనే శీర్పికతో వెలువడిన పుస్తకమిది. వీటిలోని పద్యాలను భాషాప్రవీణ టి.వి.కె. సోమయాజులుగారు సేకరించారు. ఈయన తణుకువాసులు. బెంగుళూరులోని శ్రీరస శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య ఈ పుస్తకాన్ని 2006లో ప్రచురించింది. పుస్తక ప్రచురణకర్తలు ప్రొఫెసర్ టి.వి. సుబ్బారావుగారికి ధన్యవాదాలు. 
ఇక పద్యం విషయానికొస్తాను.
ఈరోజుల్లో కొందరు యువకులు బాధ్యతారహితంగా ఎలా ఉంటున్నారంటూ వారి లక్షణాలను కవి ఓ సీసపద్యంలో వ్రాసాడు. కవి ఎవరో తెలీదు కానీ పద్యం బాగుంది. ఒకటి రెండు మాటలు తప్పిస్తే పద్యంలోని మాటలన్నీ ఇంగ్లీషు మాటలే. బలేగుంది చదువుతుంటే.
---------
పద్యం శీర్షిక "మోడరన్ లివింగ్!
----------
సీ. 
సందులో శ్టాండింగు సతులకై వెయిటింగు
       మోడరన్ డ్రస్సింగు పోజ్ గివింగు!
సిగరెట్సు స్మోకింగు - సినిమాస్కు గోయింగు
        ఫ్రెండ్సుతో మూవింగు వాండరింగు!
ఇరిటేటు మైండింగు హిప్పీసు కట్టింగు
         రెక్కులెస్సు టాకింగు రీజనింగు!
కోయిన్సు స్పెండింగు గుడ్నాట్టు హియరింగు!
          రెఛడుగా హెడ్ స్ట్రాంగు రిప్లయింగు!
తే. విలను పోజింగు తండ్రికి వేవరింగు
తల్లి ఫియరింగు కార్యసాధన నథింగు
భవ్యవైఖరి తమ్ముళ్ళు ఫాలొయింగు
రాంగు గోయింగు ఈ మోడరన్ లివింగు!!

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం