సనా గుహలు .; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 ఇవి మానవ నిర్మిత గుహలు. ఇవి గుజరాత్, సోమనాథ్ లోని ఒక కొండ పైన ఉన్నాయి. ఈ గుహలను సా.పూ 2 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుహల్లో అందమైన బొమ్మలు, స్తూపాలూ ఉన్నాయి.
సనా గుహల పేరుతో రెండు చోట్ల గుహలు ఉన్నాయి. ఈ రెండూ గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలోనే ఉన్నాయి. ఒకటి, ఊనా తాలూకాలో సనా వంకియా వద్ద ఉన్న సనా దుంగార్ బౌద్ధ గుహలు. ఈ ప్రదేశం ఊనా పట్టణం నుండి 28 కి.మీ. దూరం లోను, తులసి శ్యామ్ నుండి 35 కి.మీ., రజులా నుండి 35 కి.మీ. దూరం లోనూ ఉంది.
రెండవది వెరావల్-సోమనాథ్ ప్రాంతంలో, వెరావల్ నుండి 7 కి.మీ. దూరంలోను, సోమనాథ దేవాలయం నుండి 2 కి., మీ. దూరం లోనూ ఉన్న సనా బౌద్ధ గుహలు. వీటిని సనా గుహలు అని అనరు. ప్రభాస్ పటాన్ లోని ప్రాచీన గుహలు అంటారు. ఈ రెండు గుహల మధ్య దూరం 105 కి.మీ. పేర్లలో ఉన్న సారూప్యత వలన, ఈ రెండు ప్రదేశాల్లో ఉన్న సామీప్యత వలనా ఈ రెండు గుహల గురించిన సమాచారం పత్రికల్లో కలగలిసి పోయింది.
సనా దుంగార్ బౌద్ధ గుహలు.
మెత్తటి రాతిలో తొలిచిన గుహలు ఇక్కడ 62 ఉన్నాయి. స్తూపాలు, చైత్యాలు, పిల్లోలు, బెంచిలు ఉన్నాయి. కొన్ని గుహలు గుమ్మటం ఆకారంలో ఉంటాయి. కొందరు చారిత్రికుల ప్రకారం ఈ గుహల నిర్మాణం సా.పూ. 2 వ శతాబ్దంలో మొదలైంది. సా.శ. 1 వ శతాబ్దంలో వీటిని నిర్మించారని మరి కొందరు అంటారు.
వర్షాకాలంలో ఇవి బౌద్ధ సన్యాసులకు ఆశ్రయం కలిగించాయి. కొండపై అనేక ఎత్తుల్లో వీటిని తొలిచారు. బౌద్ధాన్ని ప్రవచించే సూచికలను ఇక్కడ చూడవచ్చు.
ప్రభాస్ పటాన్ గుహలు.
ప్ర్భాస్ పటాన్ వద్ద ఉన్న బౌద్ధ గుహలు వాస్తు రీత్యా సరళమైనవి. ఇక్కడ రెండే గుహలు ఉన్నాయి. సా.శ. 3-4 శతాబ్దాల నాటి బౌద్ధ విహారంలో భాగంగా వీటిని భావిస్తున్నారు. ఇవి 8.7 మీ. x 9.45 మీ. పొడవు వెడల్పులతో, 2.5 మీ. ఎత్తుతో ఉన్నాయి. గుహలకు బయట చెక్కిన గూళ్ళ వరుస తప్పించి గుహలపై ఎటువంటి అలంకరణలనూ చెక్కలేదు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం