భక్తే ప్రధానం;-- సి.హెచ్.ప్రతాప్
 1915 సంవత్సరంలో గోవింద మాన్ కర్ అనువాడు శిరిడీలో తన తండ్రికి సంవత్సరీకం చేయదలచి ఆత్మారాం తార్ఖడ్ అనే సాటి భక్తుని ఇంటికి వచ్చి శిరిడీ వెళ్తున్న సంగతి తెలియజేసాడు. శ్రీమతి తార్ఖడ్ ఇల్లంతా గాలించగా ఒక కోవా బిళ్ళ (అది కూడా ఇంతకు ముందు శ్రీ సాయికి నైవేద్యం గా అర్పింప బడినది)  దొరికింది.చేసేది లేక ఆ బిళ్ళనే మాన్ కర్ కు ఇచ్చి సాయికి నివేదించమని శ్రీమతి తార్ఖడ్ కోరింది.
 శిరిడీ చేరాక విధి కర్మలను పూర్తి చేసాక మాన్ కర్ సాయిని దర్శించాడు. వెంటనే సాయి “నా కోసం ఏమి తెచ్చావు?” అని అడిగారు. తండ్రి మరణించినందున పుట్టెడు దు:ఖం లో వున్న మాన్ కర్ తాను ఏమీ తేలేకపోయానని విన్నవించుకున్నాడు. అప్పటికి సాయి ఊరుకున్నారు కానీ మళ్ళీ మళ్ళీ అడుగనారంభించారు. ప్రతీసారి మాన్ కర్ నుండి ఒకటే సమాధానం ఎదురయ్యింది. 
ఛివరకు శ్రీ సాయి “ఆత్మారాం భార్య నా కోసం ఎంతో ప్రేమతో పంపిన కోవా బిళ్ళ నీ దగ్గర వుంది కదా ! వెంటనే వెళ్ళి దానిని తీసుకురా !” అని ఆజ్ఞాపించారు. మాన్ కర్ అసలు సంగతి గుర్తుకు తెచ్చుకొని బసకు వెళ్ళి ఆ కోవా బిళ్ళను తీసుకు వచ్చి శ్రీ సాయికి సమర్పించగా శ్రీ సాయి ఎంతో ఆత్రంగా దానిని తిని “ నా భక్తులు నన్ను ఎట్లు భావించెదరో, నేను వారిని అదే విధం గా అనుగ్రహిస్తాను. మీరు చేసే ఆడంబరమైన అర్చనలతో నాకు పని లేదు.నాకు కావలసింది ప్రేమమయమైన భక్తి మాత్రమే. మీరి నన్ను ఏయే విధాలుగా భావించి ప్రార్ధిస్తారో, నేను ఆయా విధాలుగా మిమ్మల్ని అనుగ్రహిస్తాను. నాకు భక్తే ప్రధానం. ఎలాంటి సంశయాలు లేకుండా, భగవంతుడే అన్నీ చేస్తాడన్న ధృఢ విశ్వాసంతో నన్ను ప్రార్ధించేవారిని పూర్ణంగా అనుగ్రహించి వారిని చివరికంటా కాపాడి గమ్యం చేరుస్తాను.” అని పలికారు. ఆత్మారాం భార్య బాబాకు కోవా బిళ్ళ సమర్పించాలనుకొని, ఆ తర్వాత మరిచిపోతే శ్రీ సాయి ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నైవేద్యాన్ని రప్పించుకొని స్వీకరించిన వైనం పరమాద్భుతం” 
ఈ కధ మనకు నిత్య జీవితం లో మార్గదర్శకాలు కావాలి ! భగవంతునికి కావలసింది వైభోవపేతం గా చేసే పూజలు,ఖరీదైన ప్రసాదాలు, పూజా మండపాల డెకరేషన్లు కాదు.పవిత్రమైన హృదయం, అకుంఠిత భక్తి, సేవా తత్పరత. వీటితో మంచి నీటిని సమర్పించినా ఎంతో సంతోషంగా స్వీకరించి ఆశీర్వదిస్తారు. ప్రేమ, భక్తి లేని పూజలు ఫలించవు. డబ్బు,సమయం వృధా తప్ప ఫలితం శూన్యం. అందుకే చిన్నప్పటి నుండి మనం నమ్మిన దైవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం అలవాటు చేసుకోవడం ఎంతో అవసరం.ఆనన్య భక్తితో భగవంతుని ఆరాధించి, ఆయన కృపకు పాత్రులయ్యెందుకు మనం చెయ్యాలి.



సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం