పోటీ; - : సి.హెచ్.ప్రతాప్
 రామాపురం శివార్లలో చిదానందుడు అనే మహర్షి ఒక గురుకులం స్థాపించి శిష్యులకు విద్యాబోధన చేస్తున్నారు.ఆయన సకల శాస్త్ర పారంగతుడు. వేదశాస్త్రాలను, పురాణాలను, ఉపనిషత్తులను ఔపోసన పట్టిన దిట్ట. ఆయన శిష్యరికంలో అనేకమంది సకల శాస్త్ర కోవిదులుగా తీర్చిదిద్దబడి దేశంలో వివిధ ప్రాంతాలలో మంచి కొలువులలో స్థిరపడ్డారు.
ఒకసారి రామశర్మ అనే యువకుడు చిదానందుడు వారి దగ్గర విద్యాభ్యాసం కోసం వచ్చాడు. తొలినాటి నుండి రామశర్మకు చదువుపై దృష్టి లగ్నమయ్యేది కాదు. గురువు విద్య బోధిస్తుంటే దానిపై దృష్టి పెట్టకుండా సాటి విద్యార్ధులనో, ఆశ్రమ ప్రాంగణంలో తిరగాడే పశువులను, ఎగిరే పక్షులను చూస్తూ కాలం గడిపేవాడు. ఫలితంగా మూడేళ్ళు గడిచినా రామశర్మకు చదువు ఏమాత్రం వంటబట్టలేదు. సాటి విద్యార్ధులు మాత్రం ఈ మూడేళ్ళ కాలంలో చక్కన ప్రగతి సాధించి గురువు గారి మన్ననలు అందుకున్నారు.
ఒకరోజు విరక్తితో రామశర్మ గురువుగాఉ ఏకాంతంలో వున్నప్పుడు వెళ్ళి తన మనసులోని బాధనంతా చెప్పుకున్నాడు. ఎంత కష్టపడినా చదువుపై దృష్టి లగ్నం కావడం  లేదని, ఈ సమస్య నుండి బయట పడేందుకు ఉపాయం చెప్పమని వేడుకున్నాడు. తానేమో చదువులో వెనుకబడిపోతున్నాడు, మిగితావారు ముందుకు దూసుకువెళ్తున్నారు అన్న ఆలోచన కారణంగా సాటి విద్యార్ధులపై ఈర్ష, అసూయలు పెంచుకున్నాడు. రాత్రింబవళ్ళు ప్రతికూల ఆలోచనల కారణం గా రామశర్మ తిండ్రి, నిద్రకు కూడా దూరమయ్యాడు.
అప్పుడు చిదానందుల వారు ప్రశాంత వదనంతో " గురువు విద్యాబోధన చేస్తున్నప్పుడు  ప్రయత్నపూర్వకంగా నైనా ఆయన చెప్పే మాటలపై మనసు లగ్నం చేయాలి. అప్పుడు ఆ మాటలలో కొంత శాతమైనా నీ చెవికి ఎక్కుతుంది. నువ్వు ఆ ప్రయత్నం కొంచెం కూడా  చేయడం లేదు. నీ ఇంద్రియాలు ఎటువైపు వెళితే అటే నీ మనస్సుని కూడా పోనిస్తున్నావు. యుక్త వయస్సులో పంచేంద్రియాలు విచలితం కావడం, వాటి వెనుకే మనస్సు కూడా పరుగులు తీయడం సహజం. అయితే మొక్కవోని దీక్షతో, అకుంఠిత దీక్షతో మనసును ప్రయత్న పూర్వకంగా వెనుకకు లాగుతూ, ఆధీనంలో పెట్టుకోవడం చాలా అవసరం.
నువ్వు చదువుకునే సమయంలో నీ సాటి విధ్యార్ధులవైపు పోటీ భావంతో  చూస్తున్నావు. ఆ పోటీని అందుకోలేకపోతే వారి పట్ల ఈర్షా అసూయాద్వేషాలు పెంపొందించుకుంటున్నావు. నువ్వు ముందు ఇతరులతో పోటీ పడడం మానుకొని, నీతో పోటీ పడడం నేర్చుకో. నిన్నటి కంటె బాగా చదవాలని, గ్రహణ శక్తి పెంచుకోవాలని అనుకో. చదువు,లలిత కళలు, ఉద్యోగ ధర్మం అన్నింటిలో కుడా ఉన్నత శిఖరాలను అందుకునేందుకు ఈ నియమం ఉపయోగపడుతుంది.”
గురువుగారి హితబోధతో రామశర్మకు జ్ఞానోదయ మయ్యింది.ఆ రోజు నుండి గురువు గారి సూచనలను ఆచరణలో పెట్టి విద్యాభ్యాసంలో మంచి ప్రగతి సాధించాడు.
సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం