అలనాటి గాయనీమణులు!;-సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 దాదాపు మూడు తరాల క్రితందాకా కర్ణాటక సంగీతం అయ్యర్ అయ్యంగార్ కుటుంబాలలో వారికే పరిమితం! అప్పటి స్త్రీలు గొంతు ఎత్తి పాడేవారుకాదు.గృహిణిలు  పెళ్లి పేరంటాలలో కూడా నోరెత్తలేదు. తమపాండిత్యం విద్వత్తు తమలోనే దాచుకునేవారు. సెమ్మంగుడి శ్రీ నివాస అయ్యర్  డి.కె.పట్టమ్మాళ్ తల్లి అలా  ఆడవారి వేడుకలో తోటి మహిళలకు మాత్రం వినిపించేవారు. కొన్ని కులాల వారికి మాత్రం స్వేచ్ఛ ఉండేది. మధురై షణ్ముగవడివు దేవాలయాలకు అంకితంఐన దేవదాసీలు పాడేవారు.ఇతరులకి నేర్పేవారు.ఇక గాత్రసంగీతంలో కోయంబత్తూరు తాయి సేలం గోదావరి  మద్రాసు లలితాంగి బెంగుళూరు నాగరత్నమ్మ ప్రసిద్ధులు. వారికి  ఊర్లపేర్లు ఇళ్లపేర్లుగా మారాయి.వీణ ధనం ప్రతిశుక్రవారం తన ఇంట్లోనే కచేరీ ఇచ్చేది. బైట కచేరీలకు ససేమిరా అంది.ఎవరు ఏకాస్త శబ్దం చేసినా  వెంటనే వీణ ఆపి లోపలికి వెళ్ళి పోయేది. బైట వారిని ఆహ్వానించి తన వీణ కచేరీ మొదలు పెట్టేది. బెంగళూరు నాగరత్నమ్మ బాల్యం నించి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది.తిరువయ్యూర్ త్యాగరాజు సమాధిని కట్టించి1941నించి త్యాగరాజు ఆరాధనోత్సవాలు ప్రారంభించిన  పుణ్యాత్మురాలు.అప్పుడే "నేను దేవదాసిని ఆదైవానికే దాసిని"అని ధైర్యం గా ఆమె అన్న మాటలకు  కరతాళ ధ్వనులతో ఆప్రాంతం దద్దరిల్లింది.వీణధనమ్మాళ్ అమ్మమ్మ కు అమ్మమ్మ  పాపమ్మాళ్ తంజావూరు ఆస్థాన సంగీత నృత్యకళాకారిణిగా వన్నెకెక్కింది.అమ్మమ్మ కామాక్షి శ్యామ శాస్త్రి శిష్యురాలు. ఆమె మనవరాళ్లు టి.బృంద  ముక్త   ప్రసిద్ధ రేడియో విద్వాంసులు. 🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం