ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే ఎక్కువ ఉద్యోగాలు

 ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే అధికంగా ఉద్యోగాలు వస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ కోరారు. శనివారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను ఆయన పిల్లలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 7 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని, నెలకు రూ.1000 స్కాలర్షిప్ అందిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పథకాలను తెలంగాణలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోందని, ఇప్పటికే మన ఊరు మనబడి పథకం కింద 7 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక, మౌలిక వసతులను కల్పిస్తూ అన్ని హంగులతో అందంగా, ఆకర్షణీయంగా తయారు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ఎవరో చెప్పిన మాయ మాటలు నమ్మి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ ఆర్థికంగా, అన్ని విషయాలలో నష్టపోకూడదని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ప్రముఖ నాయకుడు ఆడెపు రాజు మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలలు ప్రజల అందరి సమిష్టి ఆస్తి అని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రైవేటు విద్య భవిష్యత్ తరాలకు మంచిది కాదని, విద్య పేరుతో వ్యాపారం జరుగుతోందని, అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు ప్రైవేట్ పాఠశాలలే ఉండవని ఆయన అన్నారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యర్రా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో శాస్త్రీయ విద్యా విధానం అమలు జరుగుతోందని, కృత్యాల ద్వారా నూతన బోధనా పద్ధతులను అవలంబిస్తూ పిల్లల్ని ఆలోచింప చేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల్ని ఒక యంత్రంలాగా తయారు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ అక్షరాలు బట్టి పట్టించి ఇదే చదవని తల్లిదండ్రులను నమ్మించి, తమ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నారని ఆయన తెలిపారు. తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రత్యేకతను వివరించారు. గ్రామంలో ఉన్న బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో తీర్మానాలు చేయించాలని ఆయన ఎంపీపీకి విన్నవించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులను ధనవంతులుగా పరిగణించి వారికి ప్రభుత్వం అందించే పెన్షన్, రేషన్, రైతుబంధు ఇతర పథకాల ఫలాలు వర్తించకుండా చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, గూడెపు కిరణ్, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం