ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే అధికంగా ఉద్యోగాలు వస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ కోరారు. శనివారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను ఆయన పిల్లలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 7 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని, నెలకు రూ.1000 స్కాలర్షిప్ అందిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పథకాలను తెలంగాణలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోందని, ఇప్పటికే మన ఊరు మనబడి పథకం కింద 7 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక, మౌలిక వసతులను కల్పిస్తూ అన్ని హంగులతో అందంగా, ఆకర్షణీయంగా తయారు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ఎవరో చెప్పిన మాయ మాటలు నమ్మి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ ఆర్థికంగా, అన్ని విషయాలలో నష్టపోకూడదని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ప్రముఖ నాయకుడు ఆడెపు రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రజల అందరి సమిష్టి ఆస్తి అని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రైవేటు విద్య భవిష్యత్ తరాలకు మంచిది కాదని, విద్య పేరుతో వ్యాపారం జరుగుతోందని, అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు ప్రైవేట్ పాఠశాలలే ఉండవని ఆయన అన్నారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యర్రా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో శాస్త్రీయ విద్యా విధానం అమలు జరుగుతోందని, కృత్యాల ద్వారా నూతన బోధనా పద్ధతులను అవలంబిస్తూ పిల్లల్ని ఆలోచింప చేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల్ని ఒక యంత్రంలాగా తయారు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ అక్షరాలు బట్టి పట్టించి ఇదే చదవని తల్లిదండ్రులను నమ్మించి, తమ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నారని ఆయన తెలిపారు. తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రత్యేకతను వివరించారు. గ్రామంలో ఉన్న బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో తీర్మానాలు చేయించాలని ఆయన ఎంపీపీకి విన్నవించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులను ధనవంతులుగా పరిగణించి వారికి ప్రభుత్వం అందించే పెన్షన్, రేషన్, రైతుబంధు ఇతర పథకాల ఫలాలు వర్తించకుండా చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, గూడెపు కిరణ్, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే ఎక్కువ ఉద్యోగాలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే అధికంగా ఉద్యోగాలు వస్తున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ కోరారు. శనివారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను ఆయన పిల్లలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 7 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని, నెలకు రూ.1000 స్కాలర్షిప్ అందిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పథకాలను తెలంగాణలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోందని, ఇప్పటికే మన ఊరు మనబడి పథకం కింద 7 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక, మౌలిక వసతులను కల్పిస్తూ అన్ని హంగులతో అందంగా, ఆకర్షణీయంగా తయారు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ఎవరో చెప్పిన మాయ మాటలు నమ్మి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ ఆర్థికంగా, అన్ని విషయాలలో నష్టపోకూడదని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ప్రముఖ నాయకుడు ఆడెపు రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రజల అందరి సమిష్టి ఆస్తి అని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రైవేటు విద్య భవిష్యత్ తరాలకు మంచిది కాదని, విద్య పేరుతో వ్యాపారం జరుగుతోందని, అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు ప్రైవేట్ పాఠశాలలే ఉండవని ఆయన అన్నారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యర్రా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో శాస్త్రీయ విద్యా విధానం అమలు జరుగుతోందని, కృత్యాల ద్వారా నూతన బోధనా పద్ధతులను అవలంబిస్తూ పిల్లల్ని ఆలోచింప చేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లల్ని ఒక యంత్రంలాగా తయారు చేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ అక్షరాలు బట్టి పట్టించి ఇదే చదవని తల్లిదండ్రులను నమ్మించి, తమ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నారని ఆయన తెలిపారు. తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రత్యేకతను వివరించారు. గ్రామంలో ఉన్న బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో తీర్మానాలు చేయించాలని ఆయన ఎంపీపీకి విన్నవించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులను ధనవంతులుగా పరిగణించి వారికి ప్రభుత్వం అందించే పెన్షన్, రేషన్, రైతుబంధు ఇతర పథకాల ఫలాలు వర్తించకుండా చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, గూడెపు కిరణ్, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి